పుట:కాశీమజిలీకథలు -07.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పద్మిని - ఈపని నీకెవ్వరు నేర్పిరి.

చిరు - నాబుద్దిబలముచేత నేనే నేర్చుకొంటిని.

పద్మిని - కోయపల్లియన నా కొండల నడుమనున్న కొండపల్లి కెంత దూరము.

చిరు -- నాలుగుక్రోసుల దూరమున్నది దానినీవెట్లెరుగుదువు.

పద్మిని - ఒకప్పుడక్కడికి వచ్చితిమిలే. నీకీ చిరుతపులి పేరెట్టు వచ్చి నది.

చిరు - అదిరహస్యము మాతండ్రియెవరికిం జెప్పవలదన్నాఢు.

పద్మిని -- బాబూ. మీయూరిలో జెప్పఁగూడదు. ఇక్కడఁ జెప్పిన దోసమేమి?

చిరు - లేకున్నఁజెప్పదవినుము. ఒకనాఁడు. మాతండ్రిచెంచుఁడుకొండ లోయలోఁ దిరుగుచుండ నన్నొక చిరుతపులి నోటఁ గరచుకొని నేనేడ్చుచుండఁ బరుగెత్తుకొని యెక్కడకో పోవుచుండెను. మాతండ్రిదానిం జూచి వెరువక వింటికోలతో నేసి కడతేర్చి నోటినుండి నన్ను మెల్లగఁదీసి యెత్తికొని తన పల్లెకుఁ పోయి పెంచు కొనియెనట. ఒకప్పుడు నాకీకథజెప్పి యెవ్వరికిఁ జెప్పవలదనిచెప్పెను. తెలిసినదియా? చిరుతపులి నోటినుండి రక్షింపఁబడిన కతంబున నాకుఁ జిరుతపులియని పేరు పెట్టెను.

పద్మిని - హా! పరమేశ్వరా! అని పలుకుచుఁ గోలుగోలున నేడువఁదొడంగి నది. ఏమమ్మా ? నామాటలువిని అట్లు ఏడిచెదవేమి? నీకింత కష్టముగా నున్నదియా యని యడిగిన నాయనా ! నాకు నిన్నుఁ జూచిన దుఃఖము వచ్చుచున్నది. నీకువిధి యిట్లు వ్రాసెనా? అయ్యో ? అని మఱియుఁ గన్నీరుగార్చుటయు నాబాలుండిట్ల నియె.

తల్లీ ! నీకు నన్నుఁజూచిన దుఃఖమేమిటికి రావలయు? నాకువిధి యేమి వ్రాసెనో చెప్పుము. నేను ముచ్చటపడివచ్చిన దుఃఖము చూపెద వేమిటి కనవుడు పద్మినిపుత్రా ! మఱియేమియుంగాదు. నీవు చిన్నవాఁడవు ముక్కుపచ్చలారనివాఁడవు చదివికొనఁదగినవాడఁవు. నీతినేరుచుకొనఁదగినవాఁడవు. ఈ ప్రాయంబున నీదుర్వృత్తిఁ బూనుకొంటివని దుఃఖించుచుంటినని యుత్తరమిచ్చినది.

ఇది దుర్వృత్తియా? భోగమువాండ్రతోఁ గలసిన దప్పులేదని మాపల్లెలోఁ జెప్పుకొనియెదరు. వీండ్రు ఆటలు, పాటలుబాగుగానేర్చియుందురఁట తప్పుకాదనియే వచ్చితిని. తప్పు పనిచేయుట నాకిష్టములేదు. ఎట్లుతప్పో చెప్పుమని యడిగిన నప్పడఁతి యిట్లనియె


క. జార భట చోరచేటక
   చార నట ప్రభృతి నీచజననిష్టివా