పుట:కాశీమజిలీకథలు -07.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాయోగికథ

139

జయసింహుని యుదంతము నేనెరుంగను. గూఢచారులవలన శత్రువులు గావించు కపటములన్నియు మనవారు తెలిసికొనుచుండిరి. మీరక్కడికి వచ్చిన అంతయుఁ దెలియఁగలదు. రండు రండు అని తొందర పెట్టుచు అందలంబుల నెక్కించి వారి నందరఁ బాతాళలోకమునకుఁ దీసికొనిపోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వేళ యతిక్రమించుటయు అవ్వలికథ పైమజిలీ యండిట్ల ని చెప్పఁదొడంగెను.

122 వ మజిలీ

మహాయోగికథ

మహారాజా! తమ శాసనముననుసరించి వజ్రదంష్టాది దానవవీరుల బద్దులం జేసి లంకాపురంబునంగల చెరసాల కనిపితిని. ఏలాపుత్రునిఁ బుత్రమిత్ర హిత మంత్రిసహితంబుగా నిందు బందీగృహంబునఁ బెట్టించితిని. రాక్షసులు విమత భుజంగాంగనల జోలికిఁబోకుండఁ గాపాడితిని. తలాతలముగూడ మనకు వశమైనది. కౌరవ్యునికిఁ పాతాళలోకరాజ్యంబునకుఁ బట్టముగట్టవలసి యున్నది. మనకు మహోపకారము గావించిన వీరుండింకను మూర్చనుండి లేవలేదు అతని కులశీల నామాదులు వివరముగాఁ దెలియలేదు. దేవర విమర్శింప వలయునని ప్రహస్తుండు విభీషణునకు నివేదించెను.

ఆ వెంటనే గూఢచారుండొకఁ డరుదెంచి నమస్కరించుచు దేవా! నేను సారణుండ మీయాజ్ఞవడువున నవ్వీరయోగింద్రుల చర్యల దెలిసికొని వచ్చితిని వినుండు. అయ్యోగివరుండు శత్రునగర బాహ్యోద్యానంబున వసించి హరిదాసు పాటునకును వజ్రకంఠాది దానవుల పరాభవమునకు మిక్కిలి వగచుచు శరణాగతులైన పన్నగులును దనుజులుం బరివేష్టింప హరిదాసున్న తావునకుఁబోయి యనల్పతేజంబున నిద్రించు సింగంబుభాతి మెరయునున్న యావీరకుమారుంజూచి విరక్తుండయ్యుఁ బామరుండువోలె దుఃఖించుచు అక్కటా? ఈ మహావీరుఁడెవ్వడో నేనెరుంగను. తలాతలమునకు వచ్చినది మొదలు పరిచయము గలిగినది. నాయందు వీనికి నిర్హేతుకముగా గురుభావము గలిగినది. ఈసంగరము తనకిష్టము లేకున్నను నామాట మన్నించి కావించెను. ఇట్టి పరోపకారపారీణుని నాయాయువిచ్చియైనఁ బ్రతికింపవలయును. లేకున్న నీ హత్య నాకుఁ దగులును అని తలంచుచు

ఉ. ఏను బదారువత్సరములేక గతింబొనరించు సత్తప
    శ్రీనయసిద్దింజెంది విలసిల్లెడి దేనిఁ బరోపకార సం