332
కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము
కళా - ఏమనుకొని యెదరు ? సమసితిమని విరక్తులయి యుండెదరు. వసుంధరా : నాకు మా దల్లిదండ్రుల వేగఁబోయి చూడవలయునని యున్నది. రేపు పోపువునా ?
వసుం - అశ్యము పోవచ్చును. అంతఃపురమున బ్రవేశింతువుకాఁబోలు నన్నెప్పుడయిన స్మరింతువా ?
కళా — నా హృదయమే నీ యొద్దనుంచి పోవుచున్నాను. అట్లనియెద వేల ?
వసుం - మణిదిగ్దంతుల ప్రసంగ ప్రకారములాకిర్ణించిపోవవా.
కళా - స్వ గ్రామమున సభకుఁబోవుట యుచితము కాదు. తరువాత నంతయు విందుము కాదా ?
వసుం - పోనిమ్ము కౌముదిం బెండిలియాడు విషయమై పండితులతోఁ బ్రసగించి పొమ్ము వారేమి చెప్పుదురో చూతము.
కళా - రెండు వాదములు నీవే చేయఁగలవు. వాదింపనేమి యున్నది. మేమిరువురము నీ దాసురాండ్ర మయితిమి. మఱియు మా కాల్లి చేసిన యపరాధము మఱువవలయునని మిమ్ము వేడుకొనుచున్న దాన.
వసుంధరుడు - మీ తల్లి నాకొక్కనికే యపకారము చేయలేదు మనయిరువులకుఁ జేసినది కాదా ? అదిగొ పండితులు వచ్చుచున్నారు మాటాడకుము.
కళా - వీరి రాకకు గతంబేమియో ?
వసుం - ఏమున్నది ? పిరికితనమే.
అని మాట్లాడికొనుచుండఁగనే తదనుజ్ఞగై కొని యా విద్వాంసులు లోపలికి వచ్చిరి. వసుంధరుండందఱికి నమస్కరించి వారినుచిత పీఠంబులం గూర్చుండఁ బెట్టెను. అప్పుడు వారాశీర్వాదము చేయుచు నక్షత లతనిశిరంబున వై చిరి. అప్పుడు వసుంధరుఁ డార్యులారా ! అమోఘంబైన బ్రాహ్మణాశీర్వాదము స్వీకరించిమీరందఱు లోకాతీతులు. ఇట్టి యర్దరాత్రమున నాకడకు రాఁ గతంబేమియో యెఱింగింపుఁడని యడిగినఁ బెద్దనార్యుం డిట్లనియె.
పండితకంఠీరవా ! నీవు విద్యచే నధికుండవైనను బ్రాయంబున మాకంటెఁ జిన్నవాఁడవు కావున నాశీర్వచన పాత్రుండ వయితివి. మా కొక కార్యంబు గలిగియే