పుట:కాశీమజిలీకథలు -02.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

కాశీమజిలీకథలు - రెండవభాగము

కము కావలసి పుస్తకాగారమునకుబోయి పుస్తకమును దీసికొని రమ్మని నన్ను నియమించెను.

ఆ గది కొంచెము మారుమూలగా నుండుటచే నేనొక దీపము చేత బుచ్చుకొని దానిలోనికి బోవుచుండగా సత్యవతి కొంతదూరమున కడ్డమువచ్చి నా చేతిలోని దీపము లాగికొని, అయ్యో! నీవు సహాయము లేక చీకటిలో బోయెదవేల? నేనుగూడ వత్తును నడువుమని పలుకుచు నాతోగూడ వచ్చినది. నేనును పుస్తకములకట్ట విప్పుచు వెదకుచుంటిని. ఆ సమయముననే యా చిన్నది, హరిదత్తా! నీవు కొక్కోకము మొదలగు లక్షణగ్రంథము లేమైనం చదివితివా? అని అడిగినది. నేను ప్రసంగమున నడిగినదని తలంచి అక్కా! చదివితినంటిని. ఆ గ్రంథమంతయు జక్కగా నావృత్తి యున్నదా అని అడుగగా నున్నదని యుత్తరము చెప్పితిని. అట్లయిన నేను వానిలో గొన్ని శ్లోకము లడిగెదను చదువగలవా? అనిన నేనప్పటికి బరీక్ష కడుగుచున్నదనియే తలంచి అడుగుమంటిని. అప్పుడీ క్రింద శ్లోకములు మొదలందిచ్చినంత నిట్లు చదివితిని.

శ్లో॥ ప్రాయోంగనానా! పురఏసతృప్రేర్బావావసానంపురుషాలంభంతె।
     ఇదంతువిజ్ఞాయతధోపచర్యాం యధాద్రదంత్యగ్రతఏవవార్యః।
     అభ్యర్చి తాబాహ్యర తేనభూయో యాదేశకాలప్రకృతీప్రతీత్య
     శ్లధాస్తరుణ్యప్రబలానునురాగాద్రవంతితుష్యంతిశీఘ్రమేవ॥

శ్లో॥ అంగుష్టే పవ గుల్ఫ జాను-జఘనే నాభౌచవక్షస్స్తనె।
     కక్షౌకంఠకపోలవంతవసనెనేత్రాళికేమూర్దని ।
     శుక్లాశుక్ల విభాగతోమమృగదృశామంగేష్వసంగస్థితొ
     హ్యూర్థా థోగమనేన వామపదగాఃపక్షద్వయెలక్షయేత్ ॥

శ్లో॥ బాలస్యాతీషోడశాబ్దాత్తదుపరితరుణీ త్రింశతిక్యావదూర్ధ్వం
     ఫ్రౌఢాస్యాత్పంచపంచాశదవవరతో వృద్ధతామెతినారీ
     బాలా తాంబూలమాలాఫలరససురసాహార సమానహార్యా
     ముగ్దాలంకారప్రముఖ వితరణైఃరజ్యతె యౌవనస్థా॥
     సద్భావారబ్ధగాడొచ్ఛటరతసుఖతా మధ్యమాకాలుబ్దా
     మృద్వాలాపైః ప్రహహ్టాభవతి గతవయాగౌరవెణాతి దూరం॥

అని యామె యందిచ్చిన శ్లోకములెల్ల జదువగా నవ్వుచు నిట్లనియె.

ఆమె - పురుషరత్నమా! నీవు లక్షణగ్రంథములు గట్టిగనే వల్లించితివి. లక్ష్యమెట్లుండునో తెలిసికొనవలయును. కనుక యెన్నియేండ్లవరకు బాల యనిపించుకొనును?