పుట:కాశీమజిలీకథలు -02.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీకథలు - రెండవభాగము

గీ. గలిగి గర్వంబు దొట్టిదుఃఖంబు మదికిఁ
   బెనుచు నజ్ఞానపావకేంధనము ధనము
   స్వప్నలబ్ధపదార్థంబు చందమునను
   దలఁచి చూడంగ వట్టిదందనము ధనము.

చ. కొడుకులు గల్గుదాక నొక కొన్ని దినంబులు చింత నందనుల్
    బొడమిన నాయువు న్బలము బుద్ధియు విద్యయు జాలగల్గఁగా
    నుడుగనిచింత గల్గి తనునోలిభజింపనిచింత తండ్రి కె
    ప్పుడు గడుజింత సేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే.

వ॥ దీనికి దృష్టాంత మొక్కటి చెప్పెదవినుము. నేను బూర్వాశ్రమున జగన్నాధంబున నివసించి జగన్నాధస్వామి నారాధింపుచు మాలికలంగట్టి స్వామి కర్పించుచు నవియే అమ్ముకొని కాలక్షేపము చేయుచుంటిని. ఇట్లుండగా ముందు సంతాన మెడమైనందున దాని గురించే గొప్ప విదారమొకటి గలిగినది. దానికై యుపవాసములు నియమములు దానములు మొదలగు కృత్యములెన్ని యో చేసితిని. కొంత కాలమునకే వ్రతమహాత్మ్యముననో యొక కుమారుఁడు గలిగెను. వాఁడు పుట్టిన కొద్దినాళ్ళకే తల్లి మృతి బొందినది. వాఁడు కంతువసంతజయంతుల మీరియుండిన రుచి గలిగి యుండుటచే రుచికుఁడని పేరు పెట్టితి నట్టి వాని నెచ్చటికిఁ గదలనీయక నింటనే యుంచి మాలికలు గట్టుపని నేరిపితిని. ఆ పనిలో వాఁడు నాకన్న నెక్కువ కీర్తి సంపాదించెను వాఁడొకనాఁడు సాయంకాలమునఁ బూవుదండల నమ్మివచ్చెదనని పోయి మరల నింటికి రాలేదు. తరువాత నేనుఁబోయి యాగ్రామమంతయు వెదకితిని. యెక్కడను జాడలేదు. గొడ్డు వీగికన్న బిడ్డగావున మిగుల విచారించుచు, నిద్రాహారముమాని సంతతము వానినే ధ్యానించుచుఁ జివరకు బలవన్మరణము సేయ నిశ్చయించితిని. నాయుద్యమం బెఱిఁగి యాప్తుఁడైన యొక వృద్ధభూసురుండు నాయొద్దకు వచ్చి బలదేవా! నీవు పుత్రమోహంబున బలవన్మరణము నొంద నిశ్చయించినట్లు తెలిసినది. అట్టిపని మాత్రమెన్నఁడును సేయకుమీ. నీవు భక్తుఁడవు గదా యింతకు మున్ను జేసిన పుణ్యము పోవుటయేకాక చిరకాలము నిరయములో నుండవలసివచ్చును. అని మంచి మాటలచే నా యుద్యమము మాన్పెను. నాఁటినుండి నేను నిట్టి యవధూత వేషముబూని పెద్దలవలన నాత్మజ్ఞానము సంపాదించి విజ్ఞానయోగి అను పేరుతో దిరుగుచుంటి. శిష్యా! ఇట్టి శోకమంతయు నా కుమారుని మూలముననే కదా వచ్చినది. మొదటనే యతఁడు కలుగకుండనిచో దుఃఖమే లేదు.

ఉ. కోరకు మేపదార్థమును గోరినవచ్చునె రానివస్తువుల్
    గోరకయున్న రావె తనకున్ లభియింపఁగనున్న యర్థముల్