పుట:కాశీమజిలీకథలు-12.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అనంగమోహిని నెత్తుకొనిపోయినాఁడని యాక్రోశించుచుఁ బోయి యావార్త హేమా వతి కెరింగించిరి. అనంగమోహినికి వచ్చిన కష్టపంరంపరల కామెమిక్కిలి విచారించినది. ఈ వృత్తాంతము నలువురకుఁ దెలిసిన దనగుట్టు క్రమముగా బట్టబయలగునను భీతిచేఁ యెవ్వరికిం దెలియనీయక కప్పిపుచ్చెను. అప్సరోయువతులఁ దిరస్కరించు రూప లావణ్యముల నొప్పియున్న యనంగమోహిని యెట్లయిన నమరలోకమునుండి యవుల కేగుటకు హేమావతి మనంబున సంతసించెను.

రక్కసుండొక్క డేతెంచి యెవరినో వేలుపు ముద్దరాలి నపహరించుకొని పోయెననువార్త యెట్టులో స్వర్గపుర వీధులయందెల్లడల వ్యాపించి క్రమముగా శచీ కళత్రునికిఁగూడ దెలిసినది. స్వర్గమందలి వారెవ్వరును దప్పిపోలేదని తెలిసికొని యా వార్త‌ ప్రమాదజనితంబని యూహించి యూరకుండిరి.

311 వ మజిలీ

అలకాపుర సమీపప్రదేశ మొక్క నిముసములో మహాసంగ్రామరంగస్థల ముగా మారినది. యక్షలోకంబంతయును సంవర్తసమయసముద్భూత ప్రచండజంతళా మారుతవిలోలకల్లోల మాలావికీర్ణ మహార్ణవంబు తెఱంగున భయంకరంబయ్యెను. మణి గ్రీవజలంధరుల కలహము మొదట ద్వంద్వయుద్దములోనికిదిగినది. ఈ వార్త పురము లోని వారికిఁ దెలిసి పలువురా యుద్ధరంగమున కేతెంచి యతి దారుణముగాఁ బోరుచున్న వారింగాంచి యెవరిపక్షమువారు వారివైపు జేరి కయ్యమొనర్ప సాగిరి. ఆ ద్వంద్వయుద్ధమే సంకులసమరమయ్యెను. ఈ యుదంతము పిన్నలనుండి పెద్దలవరకుఁ బ్రాకినది. యక్షులలో రెండుపక్షములేర్పడి‌ చివురకయ్యది దారుణసంగ్రా మముగా మారినది. ఆ సంగ్రామ రంగమునందు కత్తుల సవరించువారును బల్లెముల నెత్తువారును వింటినారుల సరిజేయువారును బాణపుంఖములకు ---లలం గట్టువారును పరశువులం బట్టువారును భిండివాలములఁ గదల్చువారును పట్టిసములు బరికించువారును తోమరమునఁ జేఁబూనువారును, గదలద్రిప్పువారును, గలిగి యయ్యెదిమహాసంరంభ దుర్నిరీక్షమై యొప్పెను.

అంతకుపూర్వ మత్యంతమైత్రితోఁ దిరుగువారిప్పుడిట్లు దారణసంగ్రామము నకు గడంగుట కేమిహేతువో యందిరువాగుల వారెవ్వరికిని దెలియదు అంతకంతకా సాంపరాయక మతిభీభత్సమగుచుండెనేగాని ప్రశాంతమొందు సూచనలేమియుఁ గనం బడుటలేదు. చిత్రకేతుండును సబాంధవ మిత్రబృందముగాఁ గొడుకుబక్షమునకేగి యీసుమెయి బ్రత్యర్థులతోఁబోరాడుచుండెను. ఆ సమయమునఁ గుబేర నలకూబరులు దేవసభకు స్వర్గమున కేగియుండుటచే దమ పురమున జరుగుచున్న యీ యుద్ధ విషయమేమియు నెరుఁగనే యెరుఁగరు.

అలకాపురం బట్లు యుద్ధ నిమగ్నమైయున్న కతమున వీధులెల్ల శూన్యము లైనవి. పురుషుఁడైనవాఁ డొక్కరుడును నగరమందు లేఁడు. సౌధోపరిభాగములయం