పుట:కాశీమజిలీకథలు-12.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యందున్న యనంగమోహిని శిరోరత్న మా సందడిలో జారిపడినది. దాని నమ్మహా రాజు సంగ్రహించి నిజోత్తరీయంబునఁ బదిలపరచెను. రత్నము పోయినది మొదలు నా సత్వము క్షీణింపసాగెను. ఆ రాజు తన కుటారధారచే నా మేనిపై నెన్ని నరకులు బెట్టెనో చెప్పఁజాలను. ఆపాదమస్తకము వాని కత్తిపోటు తగలని ప్రదేశములేదు. శరీరమునుండి నెత్తురు వెల్లువయై ప్రవహింపఁదొడంగినది. నన్నాతఁడెత్తి‌ గుహాముఖం బున విసరివేయుట కొంచె మెరుంగుదును. పిదప నేమైనదో నేనెరుంగను. నాకు తెలివి వచ్చుసరికి మీ చికిత్సాలయమున నుంటిని. ఇచ్చటికెట్లు వచ్చితినో యచ్చట వారేమైరో నేనెరుంగనని తన కథ యంతయును జెప్పి యూరకుండెను.

వాని యుదంత మంతయును విని విని యచ్చట నున్న వారెల్ల విస్మయ మందిరి బలిచక్రవర్తి కుంభుఁ డొనరించిన యపరాధమింకను విమర్శింపవలసి యున్నది. ఇప్పటికి వీనిని బందిగంబున నుంపుఁడని వానిఁబంపివేసి శేష వాసుకులతో నిట్లనియె. హితులారా ! వీనివలన ననంగమోహిని తన శీలమును రక్షించుకొనుచు కుశలముగా నున్నట్లు తెలిసినదిగదా ! మరియుసు సద్గుణగరిష్ఠుండగు దివోదాస ధారుణీచక్రవర్తి సంరక్షణంబున నామె యున్నదని గూడ తెలియుచున్నది. ఆమెకింక నేమియను‌ భయంబుండబోదు. మీరు నిశ్చిం తతొ నుండవచ్చును. కొలది కాలంబుననే యా రాజన్యుండామె నిచ్చటకు బంపఁగలడని వారి ననునయించి నిజనివాసంబులకు నంపివేసెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతమవ్వలి మజిలీ యందిట్లు చెప్పందొడఁగెను.


308 వ మజిలీ

గుణవతికథ

గోపా ! వినుమట్లా దివోదాసుండు యోగమార్గంబున దివంబున కెగసి దైవవశంబునఁ దిన్నగా నలకాపుర బాహ్యోద్యానవన సమీపంబునకుఁ బోయిచేరెను. ఆ యుద్యానవన రామణీయకమునకు మిగుల వెరఁగందుచు నచ్చటి విశేషంబులం జూడ నుత్సుకతంజెంది యా యుపవనాభ్యంతరమున కరిగి యందందుఁగల వింతలంజూచుచు విహరింపుచుండెను.

లయగ్రాహి

కాంతిఁగల యందపు కుడుంగముల యందతి పసందుగనుబొంది కవ హింపన్‌ ! ముందుఁగనువిందుగ నమందగతిఁ బెం పెనఁగ సుందర లతానిచయ మందొలయు నాయిం ! దిందిరములెల్ల మధువుందనిపి మైకమున సిందడియొనర్పఁ