పుట:కాశీమజిలీకథలు-06.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(11)

శీల కళా విద్యా రూపవతుల కథ

81

యజ్ఞదత్తునివంటి విద్వాంసుఁడును వివేకవంతుఁడును పుడమిలోలేడని నా యభిప్రాయము. అట్టివాఁడే ద్రోహములుచేసిన భూమి నిలుచునా? అయినను వారిజాడ వెదకించి యిందు వచ్చునట్లుఁ జేయుఁడు. దగిన దూతలం బుచ్చుడు.

అని రాజు నియోగించినంత మం త్రులట్లు కావించిరి. అమాత్యప్రేషితులైన కింకరులు నలుమూలలకుంబోయి యొక క్షేత్రంబున శివాలయములో జపముఁ జేసికొనుచున్న యజ్ఞదత్తుంజూచి గురుతుపట్టి సవినయముగా నతనికి రాజశాసనముఁ జూపిరి. అయాజ్ఞ శిరసావహించి యతండు భార్యతోఁగూడ వారివెంట విశాలాపురంబున కరుదెంచెను. అతనిరాకవిని ధర్మపాలుం డెదురువచ్చి యతనింగాంచి ప్రహష్టాంతరంగుండై గౌఁగలించుకొని యుచిత సత్కారములతోఁ దీసికొనిపోయి పీఠంబునఁ గూర్చుండంబెట్టి యల్లన నిట్లనియె.

ఆర్యా ! కళావతీ రూపవతుల వెంటఁబెట్టుకొని యెందేగితిరి. ఆ బాలికల దీసికొని వచ్చితిరా ? నాతోఁజెప్పిన నే మీ యానతి నతిక్రమించు వాఁడనా ? ఎందెందుఁ దిరిగితిరి? విశేషములేమి? ఆ కన్యకలును మీరును సేమముగా వచ్చితిరా యని యడిగిన విని యాజన్ని కట్టు నిట్టూర్పు నిగుడింపుచు దేవా ! మీ బాలికల మీ కెరింగింపక విదేశమునకుఁ దీసికొని పోవుదునా? వారు మా యింట నుండఁగనే చెప్పక లేచిపోయితిమి. ఇంత నిక్కువంబు. వారి వృత్తాంతము నాకేమియుఁ దెలియదని నుడువుటయు నా రాజు మూర్చావేశముతో నేలంబడియెను. సామంతులు సేదఁదీర్చి పీఠముపైఁ గూర్చుండఁబెట్టిరి.

అప్పుడు హితవాది యనుమంత్రి మొగంబునఁ గోపం నభినయించుచుఁ దాపనగరాసా ! నీనిడులేమియు సరిపడినవికావు. నీ యుడుము లెరుగుటకై నీకడ నసువులకన్న బ్రియమగు నసువులనిడిన గడియింపక ------------ పోయితినని చెప్పితివి. ఇది యేటినీతి ? వా రిపుడు గనంబడుటలేదు. ------------ దాచితివో లేక ద్రోహము సేసితివో నిక్కము వక్కాణింపుము. -------------- నొడయం డార్తిఁ గృశించుచున్నాఁడు. సత్యవాదివై ప్రాణముఁ గాపాడుకొని------- . తీవ్రముగాఁ బలుకుటయు నతండు చెవులు మూసికొని శివ శివా ! ఎంత------------- హా ! యెంతపాపినైతిని. అక్కటా ! ఎట్టినింద మోసితిని. అన్నా ! పురాకృతమా ! ఎంతచెడ్డవైతివి. ఆహా ! కాళావతీ రూపవతులు నాకేమి యపరాదము సేసిరని వారికి ద్రోహము చేయుదును. నా బిడ్డకన్న వారు దొడ్డవారు -------? అట్టిమాట యనుటకన్న నాకు శిరచ్ఛేదము సేయరాదా? అని పలుకుచు యూరక దుఃఖింపఁ దొడంగెను. ఇతర మంత్రు లతండ నపరాధియనియు హితవాది యపరాధియనియు వాదించుచుండిరి. ధర్మపాలుం డేమాటయుఁ బలుకనేరక విభ్రాంత స్వాతుండై చింతించుచుండెను.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరావధంబునఁ జెప్పబూనెను.