పుట:కాశీమజిలీకథలు-06.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వల్లభులు బహువల్లభులని వినియుండలేదా ఇంటికిం బోయిన మన పరిగణన మెప్పటికో యని యర్థోక్తిగాఁ బికస్వర వికస్వరరవంబునఁ దెలిపినది.

బోజుండు పెచ్చు పెరుగుతమి నింత యేల బాలా ! నీ కే లిటుతమ్ము. గాంధర్వంబునఁ బరిగ్రహింతుఁ గంతుఁడే మనను బురోహితుండని పలికిన విని ప్రజ్ఞావతి సంతసించుచు దేవా ! ఇది దేవచోదికము. నీ నిమిత్తమే మేమిక్కడికి వచ్చితిమి. మేము గంధర్వులము. హరిపత్నిచే మాకీ యుపదేశము చేయఁబడనదని యా వృత్తాంతమంతయుఁ జెప్పినది. అప్పుడా బోజనరేంద్రుండు పరమానంద కందళిత హృదయార విందుండై యయ్యరవిందగంధిం గాంధర్వ వివాహంబునఁ బత్నిగాఁ గైకొని కేలు గేలం గీలించి యుద్యానవన సౌంధంబునకుం దీసికొనిపోయి తన భార్యలకు జూపుచు నక్కాంతామణి వృత్తాంత మంతయు నెరింగించెను.

అక్కురంగనయనలును గమలను జెల్లె లిగా నెంచి గారవించిరి. లీలావతి తాను గట్టుకొనిన చీర కమలదని విని విధిఘటితమును గురించి పెద్దగా నుపన్యసించినది. అట్లు బోజనరేంద్రుండు లోకైకసుందరులఁ నలువుర బెండ్లి యాడి మహేంద్రవై భవంబున రాజ్యంబు సేయు చుండెనని యెరింగించి యయ్యతి పంచాననుండు తత్కథా శేషంబు తదనంతర నివాసదేశమునఁ జెప్పఁ దొడంగెను.

తొంబదియేడవ మజిలీ

భోజుని రాజ్యపాలనము కధ

పతంగకులంబులు కులాయంబులనుండి వెలువడి కలకల ధ్వనులతో నలుదెసలకు బారుచున్నవి. చిగురించిన రసాలతరు శాఖలవసించి పికని కరంటులు మధురస్వరంబులఁ గూయుచున్నవి. నర్మదా నదీసీకర చోకరములగు మందమారుత పోతంబులు హాయిగా వీచుచుండెను. కుసుమకిసలయ ఫల మనోహరములై న తరులతా షండంబులు కన్నుల పండువుఁ గావించు చుండెను. ఒకనాఁ డట్టి సమయంబున బోజనరేంద్రుఁడు క్రీడావనంబున కరుగుచుంట రాజమార్గంబున నొక పండితుండతని కెదురువడి కన్నులు మూసికొని నడువఁ దొడంగెను. బోజుండందు నిలువంబడి యా విప్రు నుద్దేశించి పారుఁడా। నీ యాకారముసూడ విద్వాంసుండవువలెగనంబడు చుంటివి. నన్నుఁజూచి యాశీర్వదింపక విశేషించి కన్నులు మూసికొని యరుగు