పుట:కాశీమజిలీకథలు-05.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

47

    ప్రజ్ఞానంబ్రహ్మ
    అహం బ్రహ్మాస్మి
    తత్త్వమసి
    అయమాత్మాబ్రహ్మ?

అను నాలుగు మంత్రములచేతను బ్రహ్మభావ యుపదేశముగా భావించెను. పిమ్మట శాస్త్రగూఢములగు వ్యాసమహర్షి హృదయాశయములఁ బ్రకటింపుచు బ్రహ్మ సూత్రముల యందుఁగల సంపద్రాయార్థములనెల్ల నయ్యతి తల్లజుండు శంకరునకుఁ జక్కగాఁ దెలియఁజేసెను. వ్యాసమహర్షి వలన శ్రీశుకుండు శ్రీశుకుని వలన గౌడ పాదుండును, గౌడపాదుని వలన గోవిందతీర్థులను, బ్రహ్మసూత్రార్థముల సంప్రదాయ సిద్దముగాఁ దెలిసికొనిరి. కావున గోవిందయతి యెఱింగించిన విషయములు యథార్థము లని చెప్పుటకేమియును సందియములేదు. మఱియు గోవిందతీర్ధులు పాతాళమునకేగి యనంతుని వలన సంగ్రహించుకొనిన విద్యలు యోగములును, మంత్రములుఁ దంత్రములును చతుష్షష్టికళలను ఆ శంకరాచార్యున కుపదేశముఁగావించి తత్సంప్రదాయముల నెల్లఁ గరతలామలకముగాఁ దెలియఁజేసెను. అనేక జనన కృతసుకృతపరిపాకంబునం గాని పొందశక్యము గాని సన్యాసాశ్రమమును స్వీకరించి శంకరాచార్యులు ధ్రువుండు వోలె పరమోన్నతస్థానమును బొంది ప్రకాశించెను. అప్పుడందున్న తాపసులు కొందఱతని యాకృతి విశేషమునుం జూచి విస్మయముఁ జెందుచు నొండొరు లిట్లు సంభాచుకొనిరి.

వరరుచి - ఆర్యా! యీ బాలయతి యతిపాటవమగు శాటీపటముచేఁ గప్పఁబడి యెట్లుండెనో చూచితివా?

మతంగుఁడు - దివసావసానంబున రక్తమేఘచ్ఛాదితమగు హిమగిరి కూటమువలె నొప్పచుండెంగదా.

వరరుచి - అగునగు. గజాసురుని సంహరించి రుధిరాపుతమగు తచ్చర్మంబునరుణశాటీపల్లవము నెపంబునఁ బూనిన శంకరుండే యితండని యూహింపుము.

మతంగుఁడు - మేలుమేలు. చక్కనిపోలికఁ దెచ్చితివి. ఇతండు భూతాశక్తియు గోవిహరణము భూతిసంగమము భోగుల సహవాసమును బరిహరించినను స్థూలసూక్ష్మ కారణంబులను త్రిపురంబులు దహించుటచే నపరశివునిఁగాఁ జెప్పఁదగినదేకదా.

వరరుచి - దుఃఖసారమై దురంతమై దుష్కృతమేఘయుక్తమైయొప్పు సంసారవర్షర్తును దూరముగా బరిహరించి ప్రతిపక్ష పండిత మృణాలనాళంకుర గ్రాసత్వంబుగలిగి సన్మానసక్రీడావిశేషంబుఁ జెందుచుండుటచే నితనినిఁ బరమహంస శిరోమణియని చెప్పుటకేమి సందియమున్నది.

మతం - సందియమేల? ఈ ద్విజకులావతంసము పరమానంద స్వరూప