పుట:కాశీమజిలీకథలు-05.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీకథలు - ఐదవభాగము

    నేకముఖమునవారి రక్షింప నవత
    రించినట్టి పతంజలి నీవెకావె.

గీ. అలరసాతలమునకేగి యటభుజంగ
    సాధుముఖమున నధ్యయనంబుఁజేసి
    యోగశాస్త్రములతోఁ గూడ నుర్విశబ్ద
    శాస్త్రభాష్యము నెరపిన సామివీవె.

మ. శుకశిష్యుండగు గౌడపాదువలనన్ క్షుణ్ణంబుగాఁదత్త్వముల్
     సకలార్ధంబులు సంగ్రహించిన ధృఢ స్వాంతుండవత్యుత్తమ
     ప్రకటప్రజ్ఞుఁడ నీవు నీవలన భాస్వద్బ్రహ్మనిష్ఠన్ సమా
     ధికృతాత్మన్ గ్రహింపవచ్చితిని ప్రీతిన్నాకు బోధింపవే.

అని స్తుతియించుటయు నాలించి యయ్యతిచంద్రుండు కన్నులందెఱచి నిజచరణ పరిసర ధరణీతలంబున నిటల తటఘటితాంజలి పుటుండై యున్న శంకరుం గాంచి తదీయ ప్రభా విశేషమున కచ్చెరువందుచు [క స్త్వం] నీ వెవండవని యడిగినఁ పూర్వ పుణ్యోపార్జితబోధాంకములగు వచనంబులచే నమ్మహాత్మున కిట్లుత్తరముఁ జెప్పెను.

శ్లో. స్వామీన్నహంస పృథివీనజలంనతేజో
    నస్పర్శనోనగగనంనచతద్గుణావా
    నాప్రీంద్రియాన పితువిద్ధితతో విశిస్టో
    యః కేవలోస్తి పరమస్సశివోమహస్మి.

స్వామీ! నేను పృథివియు నుదకములు నగ్నియు వాయువు గగనము శబ్దస్పర్శరూపరసగంధములు నింద్రియములుంగాను, తద్బాధావిశిష్టుండై కర్తృత్వ భోక్తృత్వాదివినిర్ముక్తుండై సర్వోత్తముఁడై చిదానందమయుండైన పరమశివుండెవ్వడు గలడో యాతండ నేనేయని పలికిన విని యమ్మహర్షి హర్షపులకితగాత్రుండై సౌమ్యా! నీవు సాక్షాచ్చంకరుండవు అతనిగూఢంబగు నద్వైతమార్గంబు దెరంగెరింగింప నవతరించితివి. సమాధి దృష్టినంతయుంగంటి రమ్ము రమ్ము. లోకవిడంబరమునకై నీకుఁ బ్రణవమంత్రోపదేశముఁ గావించెదను. మదీయపాదంబుల నర్చింపుము అని పలికెను. అప్పుడు శంకరుండు యతిసంప్రదాయమును బరిపాలించు తాత్పర్యముతోఁ దానెరింగినవాడయ్యును సవినయోపచారములచే గోవిందయతీంద్రు ననేక బ్రకారములు సేవించెను. తత్సేవవలన మిగుల సంతుష్టినొందుచుఁ బ్రణవమంత్రోపదేశపూర్వకముగాఁ జతుర్వేద శేఖరవచనములచేఁ గ్రమముగా,