పుట:కాశీమజిలీకథలు-05.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

కాశీమజిలీకథలు - ఐదవభాగము

చున్నది. అట్లే యుంచుకొనుడని పలుకుచుఁ నామెను విడిచి తురగ మెక్కి యతివేగముగా సేనానివేశమునకుఁ బోయెను.

అంతకుముందు తండ్రియొద్దనుండివచ్చియున్న లేఖావాహకుం జూచి యీరాజపుత్రుఁడు దూరమునందుండియే గురుతుపట్టి యోరీ! మహారాజు కుశలుఁడేనా? అంబకు భద్రమా? రాష్ట్రమంతయు సుఖముగా యున్నదా? యని యడిగిన వాఁడును వినమ్రుఁడై చిత్తము చిత్తమని పలుకుచుఁ దనచేతనున్న పత్రికాద్వయ మతని కందిచ్చెను. అతండా పత్రిక విప్పి యిట్లు చదివెను.

స్వస్తిశ్రీ మహారాజాధిరాజ! తారాపీడమహారాజ మార్తాండుఁడు శ్రీమంతుఁ జంద్రాపీడు నుత్తమాంగమున ముద్దిడుకొనుచు వ్రాయునది.

ప్రజలు సుఖులై యున్నవారు నీవు దిగ్విజయయాత్రకుఁ బోయి చిరకాలమయినది నిన్నుఁ జూచుటకు మాహృదయము మిక్కిలి యుత్కంఠ నొందుచున్నది. నీతల్లియు నంతఃపురకాంతలతోగూడ గృశించియున్నది. యించుక జాగు సేయక యీ పత్రికం జదివి ముగించినసమయమే ప్రయాణకాలముగాఁ జేసికొని రావలయును.

శుకనాసుఁడు వ్రాసిన రెండవపత్రికలోఁగూడ నిట్లేయున్నది. వైశంపాయనుఁడు సైతమట్టి యర్ధముతోఁ దనకును వచ్చిన యుత్తరముల నతనికిఁ జూపెను.

అప్పుడు చంద్రాపీడుఁడు మిక్కిలి తొందరపడుచు వెంటనే ప్రయాణభేరి గొట్టింప నాజ్ఞాపించెను. మేఘనాథుఁడను సేనాధిపతిని యోరీ! నీవిందుండుము. ఇచ్చటికిఁ బత్రలేఖను గేయూరకుఁడు దీసికొని వచ్చును. దానితోఁగూడ నీవింటికి రమ్మని పలికి వెండియు నిట్లనియె

మానవజాతి దుష్ప్రకృతిగలది. నీ యుపకారములన్నియు నాత్మార్పణము చేసి నీయకారణవాత్సల్యత గణింపక వాజాశ్సిససములకు భిన్నార్ధత్వము గలుగజేసితినని తలంచెను కాబోలు. ఆస్థానమందెక్కుడు దయఁజూపిన నీసాధుత్వ మెన్నటికేని మరువఁదగినదే? నా గుణముల నీయొద్ద మిక్కిలిగా స్తుతిజేసిన మహాశ్వేత నిప్పు డెత్తిపొడుచుచుందువని నా హృదయము మిక్కిలి సిగ్గు జెందుచున్నయది. నే నేమి చేయుదును. తండ్రియాజ్ఞ యెక్కడుదిగదా! అది శరీరమాత్రమునకే యుపయోగించును. హేమకూటనివాసవ్యసనముగల నామనస్సుచేత జన్మాంతరసహస్రముల యందు నీకు దాస్యము చేయుదునని బట్టము వ్రాసి యియ్యఁగలను.

ఇప్పుడు తండ్రియాజ్ఞ నుజ్జయినికిఁ బోవుచున్నవాఁడ. యీ కృతఘ్నుని బరిజనప్రసంగమునందైన స్మరంపుచుండవలయును. బ్రతికియుండిన నెప్పటికైన వెండియు దేవీచరణారవిందవదనసుఖం బనుభవించువాఁడ, మరియు మహాశ్వేతా పదపద్మములకు శిరంబున మ్రొక్కు వాఁడ, మదనలేఖ సేమ మడిగితిని. తమాలికనుఁ గౌఁగలించుకొంటిని.