పుట:కాశీమజిలీకథలు-05.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

237

    నిందుఁ దప్పక వసియించుఁ గ్రోడములవి
          మసలుముస్త వాసనలు గడంగె
    వనమహిషంబు లవ్వల నుండు, ఱేఁగె గొ
          మ్ములఁ జిమ్ము వల్మీకముల రజంబు
    కరికలభంబు లక్కడిఁ గూడు, సల్లకీ
          రసకషాయామోగమెసఁగ నెసఁగె.

గీ. రుధిరపాటల కరికుంభ రుచిర మౌక్తి
    కాంచితాంబీపదంబు లిందలరు సింహ
    గణములవె చూడుఁ డభినవఘాసకబళ
    హరిణరోమంధ పేనసంహతులు దోచె.

చ. ఇదె చమరీమృగాళి వసియించెడు తావట నాభివాసనల్
    బొదలెడుఁ బారుచున్న వవె మూకలుగా మెకముల్ సమంబుగా
    వదలుఁడు వేటకుక్కలను భద్రమువింట శరంబుగూర్చుఁడ
    ల్లదె మెక మేదియోచనె రయంబునఁ గొట్టుఁడు పట్టుడుద్ధతిన్.

అని యొండొరులతోఁ బలుకుచున్న వేటకాండ్ర ఘోషమొండు వినంబడినది.

అశ్రుతపూర్వమగు నారొద విని నేను బాలుండనగుట చెవులు బీటలువార భయముచేత మేను గడగడ వడంక వివశత్వము నొంది సమీపము నందున్న తండ్రియొక్క జరాశిథిలములగు రెక్కలసందున దూరితిని.

అప్పుడా యరణ్య మంతయుఁ బారుచున్న గ్రూరసత్వముల యార్పులచే నల్లకల్లోలమైనది. మఱికొంతసేపునకా రొదయంతయు నణఁగి యయ్యడవి కల్లోలశూన్యమగు సాగరము లాగున నిశ్శబ్దమై యొప్పినది.

అట్టి సమయమున నేను శైశవచాపల్యంబునంజేసి యదియేమియో యని మా తండ్రి రెక్కలసందునుండి బైటికి వచ్చి కంఠముచాచి భీతిచే గదలుచున్న తారకలతో యారొదవచ్చిన దెసకే దృష్టి బరికించితిని

అప్పుడా వంకనుండి కార్తవీర్యార్జునభయంబున బారి వచ్చుచున్న నర్మదానది పగిది జంఝామారుతవికీర్ణమగు తమాలకాననము వడువున నేకీభూతమగు కాళరాత్రి సంఘాతముభాతి సూర్యకిరణాకులమైన యంధకారము తీరున నయ్యరణ్య మంతయుఁ జీకటిఁ గలుగఁజేయుచు ననేకసంఖ్యాకమగు శరబసైన్యము నా కభిముఖముగా వచ్చుచుండఁ జూచితిని.

ఆ సైన్యమధ్యంబున నుక్కు చే రచియింపబడినవో యనునట్లు కర్కశములగు నవయవములు గలిగి శ్యామలదేహప్రభాప్రవాహంబున నయ్యడవి యంతయు