222
కాశీమజిలీకథలు - ఐదవభాగము
మ. పురదైత్యుల్వరశ క్తిలోకముల నున్మూలింపగాదేవత
ల్మొర పెట్టన్వినినావొలేదొ మరి తత్పూర్వామరశ్రేణి
సంగరమందేమిటికి న్వధింపవది శక్యంబైనచోనాఁడు
చ్చరణంబుల్ శరణంబువేడినది కృష్ణా ! జ్ఞాపకంబుండెనే.
విష్ణు - గీ. సఖుడవని యెంచిప్రీతితో సంతతంబు
నీపనుల నెల్ల బూనియె నేయొనర్ప
భటుఁడవనిపల్కితౌ భళి బాగు బాగు
కన్ను మీదికివచ్చెనే గరళకంఠ !
శివు - గీ. తుల్యగౌరవసంపత్తితో సుమిత్ర
బుద్ధిమన్నించుచుండుటఁబో ముకుంద
పీఠమెక్కంగవలదని ప్రేలినావు
నడుమసిరినీకు రాబట్టి చెడితివిట్లు.
నారదుండు — [బ్రహ్మతో] తండ్రీ? నీహరిహరులు సమముగా బోట్లాడుచుండ నీవేమియు మాటాడవేమి నీ యాధిక్యతగూడ వెల్లగపరుపుము.
బ్రహ్మ — నారదా ! తొందర యేమివచ్చినది. వారిలో నొకడు పీఠమెక్కినపుడుగదా తగవు పెట్టఁదగినది.
నారదు — పీఠ మెక్కు మాటయటుండనిమ్ము. లోకాధిపతులము మేము మేమని వారిలోవారే తగవుపడుచున్నారు. నీమాట యెక్కడను ప్రశంసించుటలేదు. నీ యభిప్రాయము వేరుగానున్నది పోయి కలియఁబడి వాదింపుము.
బ్రహ్మ — వారు ప్రశంసింపకపోయినచో నాయాధిక్యత తగ్గునాయేమి ?
నారదు — [హరిహరులతో] ఈ చతుర్ముఖండేదియో చెప్పుచున్నాడు వింటిరా!
హరిహరులు — ఏమనుచున్నాఁడు.
నార - మీ యిరువురకున్నఁ దానే యధికుండట. పీఠము దానే యెక్క నర్హుడఁట.
విష్ణు — ఈ భూతపతికన్న వాని తక్కువయేమి. ఎక్కవలసినదే ?
శివుఁడు — ఈ వాసవావరజునికన్న బ్రహ్మయే యధికుఁడని నా యభిప్రాయము
నారదుఁడు — అయ్యా శివునికన్న బ్రహ్మకొక్క మొగమేగాదా తక్కువ విష్ణువుకన్న నాలుగుజేతులెక్కువ గలిగియున్నవి. మీ యిరువురకు నతండు తీసి పోవఁడు.