పుట:కాశీమజిలీకథలు-05.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

203

ఉ. ఓపరమేశ! నీవు భువనోదయహేతుఁడ వాదిమూర్తి వీ
    వేపనికై ధరియిత్రి నుదయించితివో యదితీరె నింక రా
    వే? పరితోష మొప్ప భవదీయ జగంబు నలంకరింపవే
    తాపసవంద్య! మాకుఁబ్రమదం బొనరింపవె తొంటిరూపునన్.

క. అనివేల్పులు ప్రార్థించిన
   విని యతి నిజ భువనమునకు విచ్చేయఁదలం
   చినయంతఁ జెంతనిలచెన్
   దనవృషభము పార్శ్వభూషిత ప్రమదంబై.

శా. ఇంద్రోపేంద్ర డిగింద్ర ముఖ్యసురులెంతే భ క్తినగ్గింపగా
    సాంద్రంబై దివిదేవయాన చయముల్సమ్మర్దముం జేయ ఋ
    క్షేంద్రంబల్లన నెక్కిశంకరుఁడు వాణీశుండు గేలీ యోయ
    గింద్రుల్ గొల్వఁగజేరె రాజితమహీధ్రేద్రంబు పూర్వాకృతిన్.

సీ. మంగళంబద్రిజా మహిళాకు చాలిప్త
            వరచందనాంచిత వక్షునకును
    జయమంగళము నసుర వోటి కిరీట
            ఘనమణీరుచిరాఘ్రి కమలునకును
    శుభమంగళము బాలశుభ్రభానుకళా వి
            శోభితపటుజటా జూటునకును
    వరమంగళమురూప్య ధరహారడి డీర
            ఘనసారవరశుభ్ర గాత్రునకును.

గీ. భవ్యమంగళమఖిల తాపస సమాజ
   మానసాంభోరుహసహస్ర భానునకును
   దివ్యమంగళమమల భూతిస్పురత్స
   మగ్రమూర్తికిఁ గర్పూర మంగళంబు.

అని యెరింగించి మణిసిద్దుం డప్పుడు వేళయతిక్రమించుటయు గథ జెప్పుట చాలించి పరమానందకందళిత హృదయారవిందుండైయున్న శిష్యునితో గూడం గ్రమంబున నవ్వలిమజిలీ జేరెను.

ఇది శ్రీమధిర సుబ్బనదీక్షతకవి రచితమైన కాశీయాత్రా

చరిత్రమను మహాప్రబంధమున శంకరాచార్యచరిత్రము

సప్తమోల్లాసము సంపూర్ణము

శ్రీశ్రీశ్రీ