పుట:కాశీమజిలీకథలు-05.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మీరును జీవపరమాత్మ భేదమును దేవతాభేదమును విడిచి శుద్దాద్వైతబ్రహ్మోపాసనఁ జేయుడు. ముక్తులయ్యెదరని యుక్తియుక్తముగా నుపదేసించినఁ దెలిసికొని కాంచీతామ్రపర్ణీ దేశవాసులగు బ్రాహ్మణులెల్ల నద్వైతజ్ఞానభూయిష్ఠులైయొప్పిరి.

అట్లాచార్యవర్యుండు నిజపాదసేవాపరాయణులై నానాదేశములనుండి యరుదెంచిన బ్రాహ్మణుల సద్వైతజ్ఞానబోధచేఁ గృతార్థులంగావించి యచ్చటనుండి వేంకటాచలమున కరిగి యందు వేంకటేశ్వరునిచే నారాధించి పదంపడి విదర్భరాజధానికింజని కథకై శివకేశ్వరునిచే నర్చితుండై శిష్యులతోఁగూడ నప్పట్టణంబునఁ గొన్ని దినంబులు వసించెను.


శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

53 వ మజిలీ

షష్ఠోల్లాసము

క్రకచుని కథ

గీ. మానవ కపాల మొకకేలఁ బూనిభూరి
   శూలమింకొక కేలఁ దాల్పుచు శ్మశాన
   భసితలిప్తాంగుఁడై జటాపటల మొప్పఁ
   గ్రకచనామక కాపాలిక ప్రభుండు.

స్వతుల్యవేషులగు కాపాలికులు పెక్కండ్రు సేవింపఁ గర్ణాటదేశంబున నోలగంబుండి యొకనాఁ డాప్తులతో నిట్లు సంభాషించెను.

క్రకచుఁడు - వయస్యా ! విద్యుజ్జిహ్వ! శంకరుండను దాంభిక సన్యాసి గగనపుష్పసమానమగు క్రొతమత మొకటి కల్పించి యెల్లమతస్థులం బరిభవించుచు