పుట:కాశీమజిలీకథలు-05.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

169


గాణపత్య మతము

అట్టి సమయమున నప్పట్టణవాసులగు బ్రాహ్మణు లావింతఁజూచి యాక్షేపించుచు, అయ్యా ! యింతదనుక మీ స్తుతివాక్యములన్నియు వింటిమి. ఆకాశమువలె నిరాలంబమై యవాజ్మౌననగోచరమై యొప్పు నద్వితీయ బ్రహ్మము నజ్ఞుండెట్లు తెలిసికొనఁగలఁడు. మీ మతమేమియు లెస్సయైనదికాదు. శుభములు కావలయునని యభిలాష గలిగినచో మా మతమును స్వీకరింపుడు. వినుఁడు మాది గాణసత్యమతము . అది యారుభేదములు గలదిగా నున్నది. దేవతలెల్లరు దీనినే పొగడుచుందురు. తుం డైకదంత చిహ్నితుండగు మహాగణపతి శ క్తిసహితు నెవ్వఁడు మూలమంత్రము పఠించుచు సేవించునో యతఁడే ముముక్షువు. శ్రు॥ ఆసీద్గణపతిస్త్వేకః॥ అను శ్రుతి ప్రమాణము వలన గణపతియే జగత్కారణుఁడని తేలుచున్నది. ఆయన మాయచేతనే బ్రహ్మాదులు సృష్టింపఁబడిరి. దానంజేసియేకదా యతనికిఁ బ్రారంభమునఁ బూజ్యిత్వము గలిగినదని యుక్తియు క్తముగా నుపన్యసించిన విని శంకరాచార్యులు మూర్ఖులారా! వినుండు.

గణపతి రుద్రసుతుండగుటఁ బ్రసిద్ధిఁ జెందెను. అందులకు రుద్రుండు కారణుండు. కాని శ్రుతి ప్రమాణము కాదు. మీ నుడువు లంగీకరింపబడవనుటయు వారు మరల స్వామీ ! చిహ్నలేనివాఁడు గణపతి సన్నిధికిఁ బోవుటకు యోగ్యుఁడు కాడు. మీ కట్టిచిహ్న మేమియునులేదు. కావున దేవసన్నిధి నుండరాదని పలికిన గురుండిట్లనియె. ఓరీ ! పాషండుడా బ్రాహ్మణకులంబునఁ బుట్టినఁవాడు శిఖాయజ్ఞోపవీతంబులం దాల్చి వేదోక్తములగు కర్మలం చేయుచుండవలయు నట్లయిన విప్రత్వము సిద్ధించును. వేదమునందును బురాణములయందును నిందింపఁబడిన చిహ్నలం దాల్చిన మీరెట్లు బ్రాహ్మణులగుదురు ? థాలిశులారా ! మీ దేహంబుల మూలాధారాది చక్రంబుల గణపతి విరాజిల్లుచుండె వాని సేవింపరాదా ? చిహ్నధారణంబున నణుమాత్రమైన బ్రయోజనము లేదు. వేదోక్తమగు పరమాత్మను దెలిసికొనుఁడు. ముక్తులయ్యెదరు. మరియుఁ బంచపూజాపరాయణులైతిరేని మీ యభీష్టము దీరఁగలదు అందు గణపతి యున్నవాఁడని యుపదేశించి వారి శిష్యులుగాఁ జేసికొనియెను. పిమ్మట హరిద్రా గణపతి మతవాడి ముందరకు వచ్చి యతివర్యా!

శ్లో. పీతాంబరధరందేవం పీతయజ్ఞోపవీతినం
    చతుర్భుజం త్రినయనం హరిద్రా లసదాననం
    పాసాంకుశధరం దేవం దుండాబుజకరాభయం
    ఏవయంయఃపూజ యద్దేవం సముక్తోన్రాతసంశయః

అని యున్నది.