పుట:కాశీమజిలీకథలు-05.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీకథలు - ఐదవభాగము

శ్లో॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్ధం
     చిదాకారమే కంతురీయం త్వమేయం
     హరిబ్రహ్మమృగ్య పరబ్రహ్మరూపం
     మనోవాగతీతం మహాశైవమీడె.

2. స్వ సేవాసమాయాతదేవాసురేంద్రా
   నమ్మవ్మౌళిమందారమాలాభిషిక్తం
   నమస్యామిశంబోపదాంభోరుహంతే
   భవాంభోధిపోతం భవానీవిభావ్యం.

3. అకంఠెకళం కాదనంగె భుజంగా
   దపాణౌకపాలాదపాలేనలా క్షాత్
   అమౌళౌశశాంకాదవామె కళత్రా
   దహం దేవమన్యం నమన్యె నమన్యె.

వ॥ అని యిట్లు శంకరుండు శంకరుని భుజంగ ప్రయాతవృత్తంబుల స్తుతిఁ జేయుటయుఁ బ్రసన్నుండై యాభక్తవత్సలుం డాత్మీయ దూతలం బుచ్చుటయు.

ఉ. శూలథనుఃకపాలపరిశోభితహస్తులభూతిసంచయో
     ద్దూళితగాత్రుర్ల శిశువిధుస్ఫురితోరుకిరీటులన్ జటా
     జాలలఁసశ్శురాపగుల శంకరకింకరులన్ భుజంగభూ
     షాలలితాంగులంద్రినయ నాంచితులంగనెనా పెముందటన్.

వ॥ కనుంగొనిమనంబున సందియమందుచు వత్సా! వీరెవ్వరో నన్ను రమ్మని చీరుచున్నవారు వీరి యాకారములు తమోగుణమును సూచింపుచున్నయని వీరితోఁబోవుటకు నాడెందఁ బొడంబడకున్నది. కావున వీరిం బంపివేయుమని తల్లి పల్కుటయు నయ్యతివల్లభుండు వారిని సానునయముగాఁ బోవం బ్రార్థించి మించిన భక్తితోఁ గేలుబోయి ఫాలంబున గీలించి యనంతభోగపర్యంకంబున నిండిరాసుందర పర్యంకపీఠంబునజరణపం కేరుహంబులునిచి నీలావసుధావధూటులిరుగెలంకులనిల్చి చామరములిడుచుండ గరుడుండగ్రభాగంబున దోసిలి యొగ్గి నిలువంబడ శంఖచక్రాది సాధనంబులు మూర్తీభవించి యాశ్రయింప మకుటకే యూరికుండలాద్యలంకారపరిశోభితుండై నీలనిర దనంకాశదేహంబు దీపింప మందహాసశోభితవదనారవిందుండై శయనించియున్న యిందిరావల్లభుం బ్రార్థించి తల్లికట్టిరూపము బోధించి "అమ్మా ! నీకిప్పు డెట్టివారు గనంబడుచున్న వార"ని యడిగెను.

ఉ. చందనచర్చితాంగుల విశాలసరోరుహపత్రనేత్రులన్
     సుందరనీలనీరద విశోభితగాత్రుల విస్ఫురద్గదా