పుట:కాశీమజిలీకథలు-05.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాశీమజిలీకథలు - ఐదవభాగము

     విసృజాన్నమయాదిషు పంచసుతామయమస్మిమమేతిమతిం సతతం।
     దృశిరూపమనంతమజం విగుణం హృదయస్థమనేహిస దాహమితి॥ 3

     జలభేదకృతా బహుతేవరదేర్ఘటికాదికృతానభ సోపియథా।
     మతిభేదకృతానుతథాబహుతాతవబుద్ధికృతో వికృతస్యసదా ॥ 4

     దినకృత్ప్రభయాసద్స శేనసదా
     జనవిత్తగతం సకలం స్వచితా।
     విదితం భవతావికృతేనసదా
     యతఏవమతోసి సదేవసదా॥ 5

అని యి ట్లద్వైతమతప్రతిపాదకంబులగు తోటకవృత్తములచే నా యానందగిరి యాచార్యుని స్తుతియించుటయు నాలించి పద్మపాదాది శిష్యులు తెల్లవోయి చూచుచు నిది యస్మద్గురుకారుణ్యమహిమకాక వేఱొండుకాదని నిశ్చయించి సిగ్గుపడి యూరకుండిరి.

పిమ్మట శంకరుండు గటాక్షాంకురముల వానిపై వెలయఁ జేయుచుఁ దోటకాచార్యులని పేరు పెట్టి పద్మపాదాది ప్రధానశిష్యులలోఁ జేర్చుకొనియెను. పద్మపాదసురేశ్వరహస్తామలకతోటకాఖ్యలచే నొప్పుచుండెడి శంకరాచార్యుని నలువురశిష్యులను ధర్మార్థకామమోక్షములనియు ఋగ్యజుస్సామాధర్వణవేదములనియు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యనామకముక్తిభేదంబులనియు బ్రహ్మముఖంబులనియు విద్వాంసులు సంతతము వర్ణింపుచుందురు. అట్టి శిష్యులతోఁ గూడికొని శంకరాచార్యుండు శృంగగిరియందు వసియించి భాష్యవ్యాపకము చేయుచున్న సమయంబున భారతీపీఠస్థుండగు సురేశ్వరుం డొకనాఁడు శంకరాచార్యుం జూచి నమస్కరింపుచు, మహాత్మా! నేను నీవలనఁ బరమార్ధోపదేశము వహించి కృతార్థుండనైతిని. నీరచించిన శారీరకసూత్రభాష్యమునకు వార్తికముచేయు నుత్సుకత్వము నాకుఁ గలిగి యున్నది. గంభీరవాక్యయుక్తమగు భవదిని భాష్యమును జూచుటకైనను నాకు సామర్థ్యములేదు. అయినను భవదీయకటాక్షలేశపాతంబునం జేసి యథాశక్తి నాచరింతు ననుజ్ఞ యిత్తురేయని యడిగిన శంకరుండు సంతసించుచు నీవు నా భాష్యమునకు వార్తికముఁ జేయుట నాకెంతయు సమ్మతమైయున్నది. అట్లవశ్యము గావింప వలసినదే యని శిరఃకంపమున నంగీకారము సూచించెను.

అవ్వార్త విని పద్మపాదుని కత్యంతమిత్రులును సతీర్థులునగు చిత్సఖుఁడు మొదలుగాఁగల మరికొందరు శిష్యు లొకనాఁడు శంకరాచార్యునితో రహస్యముగా నిట్ల