పుట:కాశీఖండము.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

484

శ్రీకాశీఖండము


హేతువాదికిఁ గ్రూరున కిది యనర్హ
మిమ్మహాస్తోత్రరాజ మద్రీంద్ర తనయ!

219


వ.

అని గంగాధరుండు కాశీలింగతీర్థమాహాత్మ్యంబు విశాలాక్షికి వినిపించుచుండె. ఆసమయంబున మందరాచలంబున నుండి దివోదాసోచ్చాటనానంతరంబు గాశి కేగుదెంచి బహిర్గేహంబునం బట్టాభిషేకంబు గైకొని యంతర్గేహప్రవేశంబునకు శుభముహూర్తంబు ప్రతీక్షించుచుండ నమ్మహోత్సవకాలం బాసన్నం బగుటయు నందికేశ్వరుం డేగుదెంచి యి ట్లనియె.

220


సీ.

ఊర్జమాసంబున నుడురాజునభివృద్ధి
        ప్రతిపద్దినంబున భాస్కరుండు
గగనహర్మ్యశిఖాగ్రకనకకుంభంబు గా
        నభిజిత్తునందు మధ్యాహ్నవేళఁ
బ్రాలేయకరుఁడు సప్తమరాశితోఁ గూడఁ
        బంచగ్రహము లుచ్చపదవి నుండఁ
గరణంబు యోగనక్షత్రంబులును లెస్స
        గా లగ్నసంశుద్ధి కలిమి మెఱయ


తే.

మంచికాలంబు సాధించి మనసు గెలిచి
బ్రహహరివాసవాదుల పరమనిష్ఠఁ
గాచి యున్నారు మీరాకఁ గాలకంఠ!
వేగి విచ్చేయు గేహప్రవేశమునకు.

221


వ.

అది నందికేశ్వరుండు విన్నవించినం బరమానందకందళితహృదయారవిందుండై యయ్యిందుశేఖరుండు విశాలాక్షీసహితుండై మోక్షలక్ష్మీలీలదర్పణం బై యంతఃపురప్రాసాద