పుట:కాశీఖండము.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

403


మెచ్చుడివోకయుండ మఱిమీఁదటియీగులు వేయునుండనీ
యిచ్చితి మింద్రలోకపద మిందఱుసాక్షిగఁ బొండు గ్రమ్మఱన్.

236


వ.

అనుటయు సన్నద్ధులై రాక్షసులు సంవర్తకాలంబున జలధులు మేర దప్పినచందంబున భువనంబులు ముంచి మంచుకొండకూఁతుపై విజృంభించి శంఖభేరీపటహకాహళాగానంబు రోదసీకుహరంబు పూరటిల్లంజేయ ధాత్రీమండలంబు వడవడ వడంక నడచి. రాసమయంబున.

237


తే.

శక్తి రాక్షసుతోడ రాక్షసుఁడు శక్తి
తోడఁ దలపడ సమధికాద్భుతము గాఁగ
ద్వంద్వయుద్ధంబు సాగె వింధ్యంబుమీఁదఁ
బ్రకరనిష్ఠురబహువిధప్రహరణములు.

238


వ.

త్రైలోక్యవిజయతోడ దుర్భరుండును, దారతోడ దుర్ముఖుండును, జయతోడ ఖరుండును, ద్రైలోక్యసుందరితోడ సిరపాణియుఁ, ద్రిపురహరతోడఁ బాశపాణియుఁ, జగన్మాతతోడ సురేంద్రదమనుండును, ద్రిపురభైరవితోడ దేవకంపనుండును, గామాక్షితోడ ఖడ్గరోముండును, గమలాక్షితోడ వజ్రపాణియుఁ, ద్రిపురావనితోడఁ బింగళాక్షుండును, జయంతితోడఁ గుక్కుటాస్యుండును, విజయతోడఁ గపింజలుండును, నపరాజితతోడఁ గాకవక్త్రుండును, శంఖినితోడ ఘూకరవుండును, గజవక్త్రతోడ శంఖకర్ణుండును, మహిసాక్షితోడ జలంధరుండును, రణప్రియతోడ బకుండును, శుభానందతోడఁ గిమ్మీరుండును, గోటరాక్షితోడ ధూమ్రపర్ణుండును, శివారావతోడ ధూమ్రాక్షుండును, ద్రినేత్ర