పుట:కాశీఖండము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

227


తే.

గాంచె మను వన యముఁ డనఁగాఁ దనయుల
యమున యనుకన్య నక్కాల మప్పురంధ్రి
యోర్వలేదయ్యె మగనియత్యుష్ణమైన
తేజమున కతికోమలదేహ యగుట.

261


వ.

అంత.

262


తే.

ఛాయ యనుదాని సృజియించె సంజ్ఞ యొక్క
మానినీమణి నాత్మసమానమూర్తి
నగ్రమునయందుఁ బ్రాంజలి యగుచు నుండె
నతిప్రతిచ్ఛాయ లలితమాయాస్వరూప.

263


వ.

సంజ్ఞాదేవి సవర్ణ యగు నాఛాయ కిట్లను: కల్యాణి! యేఁ బుట్టినింటికిం బోయివచ్చెద. నామాఱై నీవు మదీయాజ్ఞ సూర్యునికిం బరిచర్య చేయుము; మనువును, యముండును, యమునయు ననునీయపత్యత్రయంబు త్వదీయంబుగాఁ దలంపుము. ఈరహస్యంబు కచగ్రహణశాపపర్యంతం బెవ్వరికిం జెప్పకు మని యప్పగించి పితృగృహంబునకుం బోయె; నిట సవర్ణయు.

264


తే.

అష్టముం డగు సావర్ణి యనెడుమనువు
మఱి శనైశ్చరు భద్రాసమాఖ్యఁ గన్యఁ
గాంచే నుష్ణాంశువలన నక్కలువకంటి
తరణియును దాని సంజ్ఞఁగాఁ దలఁచియుండె.

265


వ.

ఆసవర్ణయు సర్వస్త్రీస్వభావం బగు సాపత్న్యగుణంబున సంజ్ఞాసంతానమునకంటెం దనసంతతియందు నత్యంతవాత్సల్యంబు వాటించి భోజనాలంకారలాలనంబులపట్టున వైషమ్యంబు గలిగియుండ నొక్కనాఁడు భవితవ్యతావిలాసంబు