పుట:కాశీఖండము.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

శ్రీకాశీఖండము


నీలోకంబున కధీశ్వరుం డయ్యె. ఇది బృహస్పతిలోకవృత్తాంతంబు.

256


తే.

దివిజగురునిపదంబు నతిక్రమించి
సౌరిభువనంబు గాంచి యాశ్చర్య మంది
పుణ్యశీలుండు శివశర్మ పుణ్యశీలు
నకు సుశీలున కి ట్లనుఁ బ్రకటఫణితి.

257


ఉ.

పాండురపద్మలోచనునిపార్శ్వగులార! మహాత్ములార! మా
ర్తాండసమానతేజ మిదె ప్రాంతమునందు సముజ్జ్వలప్రభా
మండలమధ్యవర్తియు సమగ్రవిలాససమన్వితంబు నై
రెండవనాకలోక మన దృష్టికి నిం పొనరించె నెంతయున్.

258


శనైశ్చరలోకవర్ణనము

వ.

ఇది యెవ్వరిలోకం బనిన వార లి ట్లనిరి.

259


తే.

శంసితవ్రత! యిది శనైశ్చరునిలోక
మితఁడు గ్రహములలో నెల్ల నతివిశిష్టుఁ
డిమ్మహాత్ముని శుభచరిత్రమ్ము వినుము
విశదముగఁ జెప్పెదము నీకు విస్తరించి.

260


సీ.

నారాయణునినాభినలినమధ్యంబున
        జనియించె బ్రహ్మ యావనజజునకు
సంభవించె మరీచి సంయమిగ్రామణి
        గలిగె నమ్మౌనికిఁ గశ్యపుండు
ప్రభవించె నాకశ్యపప్రజాపతికి మా
        ర్తాండుఁ డబ్భానుండు త్వష్టకూఁతు
సంజ్ఞాభిధాన రాజనిభాస్య వరియించెఁ
        దరణికి నది యపత్యత్రయంబుఁ