పుట:కాశీఖండము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

శ్రీకాశీఖండము


ననో! బాల్యచాపలంబుననో! మమతాస్వాతంత్ర్యంబుననో! జముండు సంజ్ఞాస్వరూపిణియైన పినతల్లి ఛాయాదేవిం గోపించి తన్నం దలంచి పాదం బెత్తిన.

266


సీ.

తనకు సంజ్ఞాదేవి మనములోఁ గడు నమి
        యిల్లడ వెట్టుట యెట్లు మఱచెఁ?
బసిబిడ్డ నేరమి పట్టి పాలార్పంగఁ
        దగవు గా దని యేల తలఁపదయ్యెఁ?
దా నేమి బిడ్డలఁ గానదా? సవతాలి
        కొడుకు త ప్పొకటి లోఁ గొన్న నేమి?
యల్పదోషంబున కననురూపం బైన
        ప్రబలదండన మొనర్పంగఁ దగవె?


తే.

జముఁడు దనమీఁదఁ బాదంబు చాఁచినపుడు
కనికరం బింత లేక యక్కలువకంటి
కంటికొనఁ గెంపు గదురంగఁ గనలి చూచి
పదము దెగి పడ శపియించె బాలు నతని.

267


వ.

అవ్విధం బెఱింగి భానుండు ఛాయాదేవిం జూచి యిట్లనియె.

268


తే.

ఎట్టియపరాధ మొనరించెనేనిఁ దల్లి
కొడుకు శపియింప దిబ్బంగిఁ గ్రూరబుద్ధి
నతివ! సత్యంబు చెప్పు మెవ్వతవు నీవు?
నావుడును శాపభీతి నన్నలిననేత్ర.

269


వ.

తనవృత్తాంతంబు సెప్పె; చెప్పిన దానియం దపరాధంబు పొడగానక యమునిం జూచి మాతృశాపంబు నివర్తింప శక్యంబు గాదు. నీచరణంబునం గలమాంసంబు కృమికీటంబులు తొలిచి భక్షింప భూమిపయిఁ బడియెడు నని పలికి కొడుకు