పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శేషధాత్రీధరశిఖరసౌధాగ్రవిహారిని వేంకటశౌరిఁ గాంచి
కాంచీకనకగోపురాంచితగృహదీప్తశుభతేజు వరదరాజును భజించి


తే.

వరకవేరసుతోభయవాహినీత, రంగరంగత్ప్రదేశవిరాజమాన
శేషపర్యంకనిద్రావిశేషణాభి, రాముఁ డగురంగధాము దర్శనము చేసి.

199


క.

కాశియుఁ గేదారంబును, శ్రీశైలముఁ గాళహస్తి చిద్గగనము రా
మేశక్షేత్రము మొదలగు, దేశంబుల శంభుఁ గొలిచితిం గదుభక్తిన్.

200


వ.

మఱియుం దక్కిన శైవవైష్ణవక్షేత్రంబుల సంచరించి గంగాయమునాసరస్వతీ
నర్మదాగోదావరికృష్ణవేణికావేరిప్రముఖపుణ్యతీర్థంబుల నవగాహనంబు చేసి పునఃపున
రాచరితైతద్విశిష్టప్రయోజనుండ నగుచుఁ దదానందంబు సదానందంబు గావింప
కొన్నిదినంబు లచ్చట నుండితి వర్తమానకాలమున నమ్మధ్యలోకము సకలకళ్యాణ
గుణాభిరామంబై లోకాంతరములకంటె నాహ్లాదకరంబై యున్నయది తద్విశేషం
బాకర్ణింపుము.

201


శా.

లోకాలోకనగావృతం బగుధరాలోకంబు బాలించుదా
నీ కాలంబున సర్వధర్మములు భూయిష్టంబులై చెల్లఁగా
నేకచ్ఛత్రముగాఁ బురూరవుఁడు రాజేంద్రుండు సౌందర్యరే
ఖాకందర్పుఁడు కీర్తివిక్రమగుణాకల్పుండు లేఖర్షభా!

202


సీ.

ప్రతిదేశమును భోగభాగ్యసంపత్ప్రజాసంపూర్ణవిభవమై పెంపుమీఱుఁ
బ్రతిదేవతావాస మతులితనిత్యోత్సవాడంబరంబుల నతిశయిల్లుఁ
బ్రత్యగ్రహారంబు భాసురాధ్యయనయజ్ఞాతిసంశోభితం బై వెలుంగు
బ్రత్యయనంబును బహుళాన్నసత్రప్రపావళిసాంద్రమై యలరుచుండు


తే.

జనులు వర్ణాశ్రమాచారసరణి లేశ, మైనఁ దప్పక సుకృతాత్ము లై మెలంగ
సకలధర్మంబులును బ్రవిస్తరము లయ్యె, నప్పురూరవుం డేలురాజ్యంబునందు.

203


ఉ.

అందఱు విష్ణుభక్తులు దయాపరు లందఱు నందఱున్ సదా
నందమనస్కు లందఱు జనస్తవనీయచరిత్రు లైనవా
రందఱు భోగభాగ్యయుతు లందఱు కల్మషదూరు లందఱున్
సుందరమూర్తు లెవ్వరినిఁ జూచిన నానృపుఁ డేలు మేదినిన్.

204


శా.

ఆసౌందర్యము నామృదూక్తివిభవం బాసాదరాలోకనం
బాసారస్యము నాచమత్కృతియు నాయౌదార్య మావైభవం