పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నీకడ నిన్నినాళ్లవలె నే వసియింపఁగరాదు దేవతా
లోకమునన్ సురేంద్రసభలో నిక నిచ్చలుఁ గొల్వుసేయుటన్
నాకడ కీవిభావరి సనన్ మఱి మీఁదటిరేయి రమ్ము సౌ
ఖ్యాకరవృత్తిఁ గూడఁగ నుపాయ మగుం జను మిప్పు డింటికిన్.

278


వ.

అని మఱియుఁ బ్రియాలాపంబుల నూఱడించి యుర్వశి గంధర్వులం గలసి దేవ
లోకంబున కరిగెఁ బురూరవుండును నక్కలికి పలికిన పలుకున కర్థంబు విచారించి
యీరేయి గడపి తనకడకు వచ్చునది యని యాదేశించుటను దరుణి గర్భధారిణిగా
నెఱింగి యొకదినంబు మితంబుసేయుట మనుష్యమానంబున సంవత్సరం బని తెలిసి
ప్రతిష్ఠానంబున కరిగి యథోచితంబుగా రాజ్యపాలనంబు సేయుచు ముర్వశీవిర
హితం బగుట భోగంబులయం దాసక్తిలేక వలసి వల్లమి ననుభవించుచుండె.

279


తే.

అహము లెల్లను దద్వధూహావభావ, మహురభివ్యక్తకృతముదావహములుగను
నిశలు దత్కుచపరిరంభనిర్భరసుఖ, కారణస్వప్నదశలుగాఁ గడపుచుండ.

280


క.

ఏఁడయ్యె నొకదినం బొక, యేఁడై యరుగంగ మానవేంద్రున కది పె
క్కేఁడు లనితోఁచ రెండవ, యేఁడు ప్రవేశించె నతని కెలమి యొసంగన్.

281


వ.

అట నుర్వశియుం బురూరవఃకళాభరితప్రదీపితం బయిన గర్భంబువలన శుభముహూ
ర్తంబున నవమోహనాకారుం డగునాయు వనుకుమారుం గాంచి గారవంబునఁ
బెనుచుచుండె.

282


తే.

అప్పు డతఁ డుర్వశీదర్శనాభిలాష, బుద్ధి రేగుచుఁ గనకాద్రి పొంత వనవి
హారపరత సఖీయుక్త యగుచు వచ్చి, మెలఁగుచున్నట్టి యవ్వేల్సుమెలతఁ గాంచె.

283


క.

ఆరమణియుఁ బ్రియ మగునుప, చారంబులఁ బ్రీతుఁ జేసి జనవల్లభుతోఁ
గూరిమి నిట్లను విను మొక, నేరుపు ననుఁ గలిసియుండ నీ కెఱిఁగింతున్.

284


శా.

నే గంధర్వులయాజ్ఞచేఁ మెలఁగుచున్కిం జేసి నీతోడిసం
యోగక్రీడలఁ దొంటియట్ల మెలఁగన్ యుక్తంబుగా దింక నీ
వాగంధర్వుల వేఁడికొమ్ము వినయం బారంగ నట్లైన సం
భోగార్థంబుగ నీకు నిచ్చెదరు నన్ భూపాలచూడామణీ.

285


తే.

అనుచుఁ బల్కిన నట్లకా కనుచు నాతఁ, డొక్కవిజనస్థలంబున నొక్కరుండు
పొసఁగఁ గూర్చుండి గంధర్వపుంగవులను, భక్తియుక్తి నుద్దేశించి ప్రస్తుతించె.

286


సీ.

సంగీతరసవిలాసమునఁ గేశవశివబ్రహ్మల మెప్పించుప్రౌఢులార
చక్కఁదనంబున శంబరారికినైనఁ జాలమి పుట్టించుసరసులార