బడినది. అఖండపండితుఁడు, అనేకగ్రంథావలోకనకుశలుఁడు, వివిధదేశభాషాకోవిదుఁడును, రసగ్రహణపారీణుఁడును, కవిశిఖామణియు నైనకృష్ణదేవరాయభూపాగ్రణి
ఆ. | “తెలుఁ గదేల యన్న దేశంబు తెలుఁ గేను | |
అని దీనిని మెచ్చినాఁడు. కొండొకపురాతనకవీంద్రుఁ డైన వినుకొండ వల్లభరాయఁడో లేక శ్రీనాథుఁడో రచియించిన క్రీడాభిరామమునందు
ఆ. | "జనని సంస్కృతంబు సకలభాషలకును | |
అని దేశభాషలందుఁ దెనుఁగు లెస్స యనియే కాక సంస్కృతముకంటెఁ గూడ నుత్కృష్టమైన దనియు వచింపఁబడినది. ఈభంగిని మనభాషాప్రాశస్త్యము ప్రశంసింపఁబడియె. ఇట్లు మహత్తరముగ భాసిల్లు మనభాషయం దనేకసత్కావ్యములు వెలయుచున్నవి. వీనిలో నెల్ల నుత్తమోత్తమము లైన సుప్రశస్తప్రబంధములు కొన్ని గలవు. వీనిని మించిన చెలువము గల రచనలు ప్రపంచమునం దెందును గోచరింపవు. ప్రభావతీపద్యుమ్న, కళాపూర్ణోదయ, ప్రబంధరాజము లీగ్రంథరాజి