పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

సీ. అత్తావు వెల్వడి యుత్త మోజునిఁ బట్టి
యొక్కవ్రేటునవానియుసుఱుగొనియె
గాలిబంట్లను హత్తిగముల మావులఁ ద్రుంచి
మదువులు గట్టించె నొడలి నల్లఁ
గడచి యచ్చోటును గని శిఖండిని దాఁకి
ద్రోవది బిడ్డలతోడ నతనిఁ
బొదివి గీటడఁగించి పిదప నేవురఁజంపె
ద్రోవదికొడుకులఁ దూపుకముల
నంతఁ బగవారిపరి జముచెంతకరిగి
వీడు సద్దడఁగుటఁ జాల వేడ్క నొంది
కదలి మామను గృతవర్మఁగలసికొంచు
నరిగెఁ గూడియశ్వత్ధామదొరనుజూడ.

క. కని కుట్టూపిరితోడను
గనులం దేలగిలవైచి కాఱియఁబడు నా
తని చెవులవేసె నంతయు
వనటెల్లనుబాసి మేనువదిలేను ఱేఁడున్.

 సీ. మఱునాఁడు వేకువమానిసియొక్కండు
రోజుఁచుఁ బఱతెంచి ఱొమ్ముమోది
కొనుచు యుధిష్ఠిరుఁ గని కాళ్ళనయివ్రాలి
యేడ్చుచు నడురేయి నిల్లుచొచ్చి
యొక్కఁడు నశ్వత్ధామ యోర్చి దృష్టద్యుమ్నుఁ
దమ్ములఁబరిమార్చియుమ్మలింప
ద్రోవదికొడుకుల నేవురఁ బొలియించి
తక్కటివారలతలలుద్రుంచి