పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్రభారతసంగ్రహము

క. అనివీడ్కొని చని తెరువునఁ
     జనువునఁగృవు ఁ దట్లుచేయఁ జనిదని చెప్పన్
     వినకొక్కఁడుఁ దగువెరవును
     దనలోఁ దలపోయుచుండెఁదఱిఁమానికడన్.

ఆ.అపుడు గూబయెుకటి యచ్చటి కరుదెంచి
     యాదమఱచి చెట్టుమీఁదఁగూర్కి
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     మెడలుగొఱికిగోళ్ళనొడలుపెఱికి.

క. ఆదియంతయుఁ గన్నులఁ గని
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     గుదుయేతగుఁ గేలం దాలిచి
     కదలెను నడిరెయి తనదు కర్జము నడుపన్.

చ. చని కృతవర్మం గృపునిఁ జక్కఁగ గుమ్ముములందుఁబెట్టి తాఁ
     గనికరమేది కై దువయు ఁ గ్రాల గుడారము దూఱి లోపలన్
     బెనుపఱి మేనులన్మఱచి నిద్దుర ఁ జెందెడునట్టి జోదులం
     గనుఁగొని యద్ది కానిపనిగా మది నెంచక యీసుపెంపునన్.

తే. తొడరి నిదురించువారి గొంతుకలుకోయఁ
     దొడఁగె బాపఁడయ్యును బచ్చి తురకవోలె
     నప్పు డల్ల యశ్వత్ధామ యలుక యెుకటె
     పెద్దగాఁజూచుకొనిపాడి పేరుమఱచి.

క. మెుదలనె దృష్టద్యుమ్నునిఁ
     దుదముట్టించుటయ కాక తోరపుఁ ద్రాటన్
     బ్రదికీనపుడె మెడఁగోసెను
     నెదమీఁదను గూరుచుండి యేమఱి కూర్కన్.