పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

పోయెనని కన్నులను నీరుపొరలఁజెప్ప
సొలసి యాతఁడుడెందంబుగలఁగివ్రాల
గ్రేననున్నట్టివారలు లేవ నెత్తి
యూఱడింపఁగఁదేఱినిట్టూర్పువిడిచి.

క. తనతోఁ గ్రీడిని వెన్నునిఁ
గొని యశ్వత్ధామనడఁప గోరి వెడలఁగా
విని యాతఁడొడల బూడిద
వనువునఁ బూసికొని తవసియ ట్లయ్యెవెఱన్.

ఆ. వారలతనిఁ గదియవచ్చిన బీతున! బ్రహ్మశిరము నాగ :బరగూతువు
విడిచిపెట్టనదియెవివ్వచ్చుడునునేసె!నొకటినొకటిరెండునొనరదాకి.

క. మింటి కెగసి రెండును బెను
మంటలు వెడలంగఁ బేర్చిమఱిమఱిజగముల్
వెంటనే కాల్పగఁ జొచ్చిన
దంటయగుచువ్యాసుఁడుడిపెఁదగనానెగులున్.

క. వ్యాసునిపంపున నిరువురు,
వీనులు విడనాడి తూపు లెవరివి వారా
వ్యాసుని యెదురని యుడిపిరి,
రోసమునం ద్రువదుకూఁతురున్ వడముడితోన్.

క. అలఁతం గొడుకులకొఱకుం,
బలవించుచు ద్రోణుకొడుకుఁ బరిమార్చి మదిం
గలయుమ్మలికము వాపఁగఁ,
బలుదెఱఁగులవేఁడనతఁడు పరుగునఁజనియెన్.

క. మఱియీయశ్వత్ధామయె,
పఱపిన యామేటితూపు పడఁతుల కడుపుల్