పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<centerప్రధమాశ్వాసము

క. అంతయుఁ గని దుర్యోధనుఁ,
     డెంతయు మది వనటనొంది యీనునవారిన్
     వంతలఁదగిలిచి సిరిఁగొన,
     మంతనమున మామతోడ మఱిమఱిచెప్పె౯.

క. అతఁడునునల్లునిఁ గొనిచని,
     ధృతరాఝ్ణృన కెఱుకపఱిచితిన్నఁ గదొరయా
     నతిఁగొని జూదంబునకు౯,
     గొతుకకపిలిపించె నటకు గొంతికొమాళ్ళ౯.

తే. పిలుచుకకొనివచ్చినట్టియావిదురువలన,
     నంతయునెఱింగియునుభీమునన్నకడఁగి
     శకునితో నాడిపుడమినిసరకుగములఁ,
     దమ్ములనుదన్నువరుసగాఁదవిలియొడ్డి.

తే.ఓడిపిమ్మట ద్రోవదినొడ్డియోటి,
     వడెయుధిష్ఠిరుఁ డప్పుడు వగపుతోడఁ
     బ్రాతిగామిని ధృతరాఝ్టృపట్టిపంచి,
     కొలువునకుఁగృష్ణ రప్పించెఁగూళగాన.

సీ. అవుడు దుశ్శాసనుఁడాయితిఁ గొల్వులో
                                  దలవట్టియీడిచి తులునయగుచు
     నన్నపంపునఁ గట్టుకొన్నబట్టయు విప్పఁ
                                  గని భీముఁడెంతయుఁగనలువొడమి
     చివ్వనాతనిపొట్టఁ జీలిచినెత్తురు
                                  త్రావెదనంచును బ్రతినవట్టి
     తొడమీఁదఁ గూర్చుండఁ దొయ్యలిఁ జసన్నఁ
                                   బిలిచిన గాంధారిపెద్దకొడుకుఁ