పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్ర భారత సంగ్రహము
బేరైన నేల నతనికిఁ,
దోరం బగుకూర్మి నిచ్చి దుర్యోధనుడున్.

వ. అతనితోడి చెలిమి కలిమి లోనం దన పినతండ్రి కొడుకుల నాతండు గెలువగలం డను గట్టి నమ్మకమ్మున నాతనిం దనయొద్దఁ బెట్టుకొని సంతసించుచుండెనంత.

క. తనవలన జదువుగఱచిన,

యనినేసెడు రాచవారి నందఱ ద్రోణుం
డును జేర బిలిచి ద్రుపదునిఁ,
దనకడకును బట్టి తెండు తడయక యనుడున్.

సీ. అందఱు నరదంబు లాయితంబుగ జేసి

వెలువడి ద్రుపదుని వీడు చేరి
కోటలు పడద్రొబ్చి క్రొత్తడంబులుగ్రొచ్చి
యూరెల్ల దల్లడమొంద జేయ
ద్రుపదుడు విని వచ్చి దుర్యోధనుడు లోను
గాగల మగలను గదసి తాకి
వాలంప గుంపుల వానలు గురియించి
చిందఱ వందఱ జేసి దండు

క. తన నేర్పు మెఱయ దూపులఁ

గనలున బరగించి ద్రుపదుగరువంబడ గన్
జని పట్టి కట్టి తెచ్చును,
గనువారలు డెందములను గళవళ పడగన్.