పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

 
సభకు వచ్చుటకు మాట్రమేకాదు సిగ్గువిడిచి యచ్చట స్త్రీలముందు తగదునని ముచ్చటింపఁ బూనునట " అని యింకొక తెయు , కాలమహిమవలన నెట్టి నైపరిత్యములయినను పుట్టుచున్నవి.! అని మఱియొకతెయు, "తెఁ బడిపురుషుఁడూ సభలో ప్రసంగింపవెడలుట దేశారిష్టము !" అని వేరొకతెయు, ఇట్లు పురుషుల మాటలు సాగనిచ్చుట యవమానకరము.! " ఆ యొండొకతెయు , తమలోఁదాము ముక్కులమీద వ్రేళ్ళు వేసికొని యద్భుతపడుచు చెప్పుకొను మాటలు మాచెవులఁ బడినవి. అంతట నుపన్యాస సమయము సమీపించినందున సభ వారిచే దుండీలంఢీ గ్రాసనాసీనురాలుగాఁ జేయఁబడిరి. తరువాత నేనుపన్యసింప మొదలు పెట్టితిని;-

"ఓ పుణ్యసతులారా! స్త్రీలకు వలేనే పురుషులకును భగవంతుఁడు బుద్ఢిని దయచేసియున్నాడు."

పొరమహాస్త్రీలు లేదులేదు.ఇది సర్వాబద్ధము స్వభావవిరుద్ద్ధము. పురుషులకు బుద్ధిలేనేలేదు. స్ర్తీలకు సేవ చేసి బ్రదుకవలసిన పురుషులకు దేవుఁడు బుద్ధియిచ్చినాఁడనుట దైవదూషణము: శాస్త్రదూషనము.

"అమ్మలారా! నా మాటలు కొంచెము వినినితరువాత మీ యభిప్రాయమును జెప్పవచ్చును. కొంచెము శాంతివహింపుడు. ఈ దేశమునందు చదువు లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసముకానరాకున్నను"

పార మహాకాంతలు (చెవులుమూసికొని) కటకాటా! నేఁడెట్టి పాపపు మాటలు వినుచుంటిమి ! పురుషులకఁట ! చదువఁట ! ఏమి యీ కలియునుప్రభావము! ఏమి యీదుష్కాలమహిమ! చదివిన పురుషుని జూచినచో నచేలస్నానము చేయవలేనని శాస్త్రములు చెప్పు