పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషారోపణములు చేయుచు , అనేకపవాదములను వేయుచు , వారిని మూర్ఖమహాజనుల ద్రష్టియందు హాస్యాస్పద్పులనుగాఁ జేయునారంభించిరి . ఈ పామర మహాజనాభిప్రాయ ప్రవాహనము నరికట్టి మరిలించుట కయి నాయజమానురాలును నేనునుగూడ పురుషస్వాతంత్ర్య విషయమున నుపన్యసించి నరంభించితిమి. నాయుపన్యాసముయొక్క పర్యవసానమును మీకుపయి ప్రకరణమునఁదుఁజెప్పెదను.

ఎనిమిదవ ప్రకరణము

గంభీదంభీగారి యుపన్యాసమయిన మూఁడవనాఁడు" పురుష స్వాతంత్ర్యములనుగూర్చి సత్యరాజాచార్యుడుపన్యసించును గనుక పర స్త్రీ మహాజనులఁదరును రాజకీయ పాఠశాలమందిరమునకు భానువారమునాఁడు ప్రాతఃకాలమున విజయం చేయఁ బార్ధింపఁ బడుచున్నారు" అని యొక ప్రకటన పత్రికను నాయజమానురాలయిన ఫాంఢీభంగీ గారు పురజులందరికి బంపిరి. కాల వైపరీత్యమువలనఁ గలుగిన యావిడ్డూరమును జూడవలయునని నాఁటి ప్రతఃకాలమున పురమునందలి సుందరీ బ్రందమంతయు పాఠశాలామందిరముకును దయచేసి సభ తీర్చియుండెను. ఆ వచ్చినవారిలో దుంఢీలంఢీగారును , గంభీదంభీగారును , అల్లరి జరగకుండ కాపాడుటకయి మాయజమానురాలిగారిని కోరిక ప్రకారముగాఁగొందఱు రక్షక భటురాండ్రును వేత్రహస్తలై వచ్చిరి. ఉపన్యాససమయము సమీపించినప్పుడు నాయజమానిరాలితోఁగలసి నేనచ్చటికిఁబోవునప్పటికి పారస్త్రీమహాజనులు "వంటయింటి మూలనడఁగి యుండక పురుషభూషణమైన లజ్జనువిడిచి మగవాఁడొకఁడు నేఁడు సభకువచ్చునఁట ! " అని యొకతెయు, "ఊరక