పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 

చున్నవి. ఉన్నదుర్గుణములు చాలక పురుషులకు చదువుకూడా చెప్పించి మఱింతమతి చెఱుపవలెనుగా!

"అమ్మలారా! నావాక్యము కడతేఱవినుఁడు. ఈ దేశము నందు విద్య లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసము కానరాకునన్ను, ఈదేశమునందలి స్ర్తీలకు వలేనే మాదేశమునందు పురుషులకు విద్య చెప్పించుట చేత వారక్కడ బుద్ధిశాలులయి."

పారమహాంగనలు -మీది పాడు దేశము;పిశాద దేశము; రాక్షసదేశము ;మీపాపిష్టి దేశముమాట మాకుచెప్పకు; మీది పాపాత్ములుండెడు నరకభూమి.

"మీరు నన్ను దూషించినను దూషింపుఁడు. పరమపాపమైన మా దేశమును మాత్రము దూషింపకుఁడు, మాది మహర్షులుండిన పుణ్యభూమి; యజ్ఞాదులకు జ్స్న్మస్ధానమయిన కర్మ భూమి; మాదేశ మనంతములయిన మహిమల కాస్పదమయినది. _ కుండలోనుండి పుట్టిన యొక మహాపురుషుఁడు సూర్యబింబమును పండిని మింగినాఁడు.రెల్లులోఁబుట్టిన యొక మహాపురుషుఁడు క్రౌంచమహాపర్వతమునకు తూటుచేసినాఁడు._"

పౌరమహానారులు _చాలు; నోరుమూసికో. నీవసత్యవాదివి; నీవు దొంగవు; నీవు కల్లఱివి. దైవస్రష్టిలో స్ర్తీలకుండును గాని పురుషులుకిట్టి మహిమ లెక్కడ నునుండవు. నీవు శంఠవు; త్రాగబోతువు; ఉన్మత్తుఁడవు.

"ఓయగ్రాసనాసీనులాలా! వీరు నన్నెట్లు దూషించుచున్నరోచిత్తగించుచున్నారా? "

ఆగ్రాసనాసీనురాలు_ ఓపౌరనారీమణులారా! ఒక్కనిమిష