పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

లేదు. నేను మాటాడ మొదలుపెట్టినతోడనే మంచము దగ్గఱనున్న కుక్క యొకటి మొఱగ నారంభించింది. కాఁట్టి దానితోనే నేను మాట్లాడినా ననుకొన్నాను. కాని యది యేమిచేప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ, రాజు తన సేవకుని నొక్కనిఁ బిలిచి నాకు దెలిసిన భాషతొ ఈ బ్రాహ్మణు నావలికిఁబంపివేయు మని యాఙపించెను . జరగఁబోవుసంగతిని గ్రహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యిటికి వచ్చితిని

అంతటిసన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్ధి పుట్టక రాజశేఖరుఁడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునా యని యాలోచించి సుబ్రహ్మణ్యము నెక్కడైనను బంపవలెనని తలఁచి మాణిక్యాంబతోఁ జెప్పి యామె యనునుమతిని కొమారునితో నాసంగతి జెప్పిరి. ఆతఁడును పరమ సంతొషముతో నొప్పుకొన్నందున, అందఱును నాలోచించుకొని చివరకతనిని పిఠాపుమునకుఁ బంప నిశ్చయించుకొనిరి ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుఁడు గారు కుమారుని బిలిచి యనేకవిధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునఁ బ్రవర్తింపవలసిన దని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి యయిదు రూపాయలను కర్చునిమిత్తమిచ్చిరి; మాణిక్యాంబయు దగ్గరనున్న దానిలో నేమియు లోపము చేయక కావలసిన దీవనలిచ్చెను. సుబ్రహ్మణ్యమును వారినెడబాయవలసిన వచ్చినదిగదా యని కంటఁ దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయలలో నొకదానిని చేతిలోఁబెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుకతిరిగి శూచుచు దారిసాగి నడచెను.