పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్కెట్‌కి పంపిన ధాన్యం గిట్టుబాటు రాలేదని తెలిసి .. అప్పుల వాళ్ళు వేధిస్తారని భయపడి పురుగుమందు తాగి బలవన్మరణం చెందాడు వీరయ్య. పొలంలోనే తరతరాలుగా వారి వంశం నమ్మిన భూమి ఒడిలోనే.

నాన్నజ్ఞాపకాలతో _ ప్రతిరోజూ పొలం గట్టున తచ్చాడి వెళ్ళే వాడు రాధయ్య. కాస్త ఊహ వచ్చాక తెలిసిందేంటంటే అప్పటికే అప్పులోళ్ళు ఉన్న పొలంలో ఎకరం మిగిల్చి అంతా లాగేసుకున్నారు.. అందుకే పొలం వనులంటే గిట్టదు దాధయ్యాకి. వీరయ్య మోతుబరిగా తిరిగిన ఊర్లోనే వ్యవసాయ కూలీగా ఏ నామూవష్షీ లేకుందా వెళ్ళిన రమణమ్మని చూసి ఎదిగాడు రాధయ్య. నాయన్ను మింగిన పొలం అంటే అసహ్యం పెంచుకున్నాడు. దీనికితోడు కరవు తాండవించడంతో రైతుల జీవితాలు అనేక ప్రాంతాల్లో దుర్భరంగా మారాయి. అందులొ విరి మండలం ఒకటి. చివరకు పట్నంలో అయితే బాగా సంపాదించవచ్చని వలస బాటపట్టాడు రాధయ్య.

“ఏంది మావా... కంట్ల నీళ్ళుగారుతున్నాయ్‌.. అత్తగాని

గుర్తొచ్చిందా ఏందీ..” అన్న వీరేశం మాటలతో స్పగతంలోకి వచ్చిన రాధలయ్యా.. లేదల్లుడూ మీ తాత గుర్తొచ్చాడు..”అనలు మనం అమ్మలాంటి ఊరాదిలి ఏదో బావుకుందామని వట్నం ఆ.. పాలీ...నగరం ఎల్లాం గందా.. ఏం సంపాదించినం.. సెప్పు... ఏరా మాట్టాడవ్‌..? నిజమే గందా..? ఏవన్నఎనకేసినమా.. ? లేకబాయె? మహో అయితే మత్తు కోనం ఎవ్చుదన్నా కాత్తంత మందు తాగినమంతేదప్ప.. ఏమన్నా సంతోషంగ గడివినమా ..? లేదే..! ఇదిగో ఇంతలో ఈ మాయదారి రోగమొచ్చింది ..ఏం రోగమ్రా అదీ. ??*

“కరోనా మావా..”

“ఆ అదే.. కరవనా అంటూ అది కరిసేసే సరికి తింటానికి తిండి లేక, ఉంటానీకి కొంపగోడు లేక, ఇంద ఇట్లా రోడ్డున బడుళ్లా.. ఎవరికి ఎవరూ పట్టనట్లు... మనిషికి మనిషిని దూరం చేసేసిన ఈ మాయదారి రోగం మంచే జేసిందో సెబరే చేసిందో... గానీ అందర్నీ ఊళ్లకి బంపిత్తాంది..

“ అదేందిమావా.. మనవొళక్మళ్లమా ఏందీ పెపంచకవేం గజగజలాడిపోతావుళ్ళా.. మనమే గందా కాస్త పుష్టిగుందాది”

“అవున్రా... ఈరేశం.. మనం మనూరాదిలి మన మట్టి మాలచ్చినొదిలి వడకనో బోతే ఎవడూ పట్టించుకోకుండా, ఎవడూ చుక్క మంచిళ్ళియకుండా వదిలేత్తే అమ్మే గదరా మనల్ని రారమ్మని విలుత్తాంది”.

“అవును మావా నిజమే...మానాయన పొలానికెళ్ళి పోగ్గాట్టి సచ్చిపోయిండనే గందా.. నేనూ నీ యెనకాలొచ్చినా. నాయన సానా సార్గు జెప్పుళ్ళా, ఉన్న ఊర్లో పొలం పనిచేసుకుని కలో గంజో తిన్నా బతికేయొచ్చురా, జనానికి బువ్వ బెట్టేటోళ్లం మనమే పంజేయకుంటే ఎట్రా కొడకా అనేవోడు నాయన. ఎంత అవసరమొచ్చినా ఏడికీ ఎల్లమాకా నేలతల్లిని నమ్ముకో అని జెప్పుళ్ళా.. మనసేడాగింది.. దబ్బు కోసం... నీకూతుర్ని. నా వీద్దని వదిలేసి ఊర్ల బడ్జా.. ఇగో ఇప్పుడు మనం సచ్చినా ఎవరికీ తెల్టుగా మావా.. ?” పది రోజుల్లో కనీసం పలకరించినోడు లేకబాయె నీళ్ళిచ్చినోడు లేదాయె ఎవరికెవరం మావా , తెల్లారిద్దో లేదో తెలియకుండె గందా..!” అంటున్న వీరేశం

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ పఏప్రిల్‌-2021 |

కళ్ళు వర్షాకాలం పంట కాల్పలయ్యాయి.. గొంతు... చలికాలం గాలి చుట్టుముట్టినట్లు వణకసాగింది.

అల్లుడికి సర్ది చెప్పి పడుకోబెట్టాదే గానీ.. రాధయ్య మనసు వముననులో లేదు..” అచ్చల మంది నగరాలకని బోతే.. ఫొలాలేడుంటాయ్‌.. అదవులేదుంటాయ్‌... నీళ్ళేడుంటాయ్‌... మన ఊరినీ మనవే పట్టించుకోకపోతే... యేేచే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడంలో తప్పేముందీ” అనీ అనుకున్నాడు...

వళ్లు

ఆశల రేడు ఆది యోగి చీకట్ల నుంచి మరలా వెలుగు వైపు ప్రయాణం మొదలెట్టాడు. గబాగబా నడుస్తున్నారిద్దరూ. లక్ష్యం తప్ప వేరే ధ్యాస లేదిద్దరికీ. సచ్చే లోపు ఊరి పొలిమేర చూడాలి అదొక్కటే వారికి ఇప్పుడు కనీపిస్తోంది. బాధంతా పంటి బిగువున దాచేసి. భయం మొత్తం భుజానికి వేళాడుతున్న బ్యాగుల్లో నెట్టేసి జిప్‌ వేసి.. నడక... నడక... నడక. తమ ఊరు..తమని కన్నజఊోరు.. తమకి లాలపోనిన ఊరు.. తవముకి మాట నేర్పినఊోరు... ఆట పాట నేర్చినఊరు.. సదువు జెప్పిన ఊరు... పుస్తైలై ఎదురు చూస్తున్న ఊరు.. కళ్లు పిల్లలై గడపకి వేలాడిన ఊరు... ప్రతీ అడుగుళకూ పలకరింపుల ఊరు... భక్తి వసపోసిన ఊరు.. అదిగదిగో... ఊరి గుడి.. అదిగదిగో సదివిన బడి దూరంగా పొలిమేర నుంచి కనిపిస్తున్న పరిమళం. ఊరిలోంచీ వస్తున్న నేపాలీ గూర్ధా కనిపించాడు... “మనకి కనిపించని నేల అతణ్ణి ఎలా పోషిస్తోందీఅన్న ప్రశ్న ఇద్దరి గుందెల్నీ ఓసారి మెలిపెట్టింది. అడుగుల్లో వేగం పెరిగింది.

పరిగెడుతున్న రాథయ్య కళ్ల కాళ్ళు అకస్మాత్తుగా ఊరి పొలిమేరలో చచ్చుపడినట్లు ఆగిపోయాయి. పొలిమేరలో రాళ్ళు రప్పలతో నిండిన ఆనాటి పచ్చటి పొలం .. నాయన సోయాక ఎదారై నోరెళ్లవెట్టిన అన్నదాత.. నాల్రోజుల రోజుల క్రితం దాహంతో అల్లాడిన తన పరిస్థితి గుర్తొచ్చి భోరున ఏడుస్తూ ఎండిన నేలమీదకు పరిగెట్టి నేలపై పడి ముద్దు పెట్టుకున్నాడు రాధయ్య. నాయన నవ్వ కనీపించింది. నెత్తిన ముద్దు పెట్టుకున్న అనుభూతి తారసలాడింది. ఆగనీ దుఖం పొంగి ఆ నేల పాదాలను కడిగేస్తోంది.

“ఏమ్టైంది మావా.. అంటూ మావ వెనుకాలే పరిగెత్తుకొచ్చి నేలపై బడి కన్నీరు మున్నీరవుతున్న రాధయ్యను ఓదార్చే ప్రయత్నం చేన్తున్నవీరేశంతోబ” చూడరా బూమితల్లి గుండె ఎట్టా పగిలిపోయున్నాదో. మీ తాత కలల పొలంరయ్యా ఇది.. అని ఒకవైపు అల్లుడికి చెబుతూనే మరో వైపు నేలను ముద్దాడుతూ “నాయనా నీ మాటా దాటి ఏదకెళ్ళనయ్యా.. ఈ మట్టి మాలచ్చినొదిలి యాడికి బోనయ్యా” అంటూ బోరున విలపించసాగాడు.

రాధయ్య చేష్టలతో విస్తుపోయిన వీరేశానికి ఇంటి దగ్గర .”పెనివిటీ” అని ఎదురు చూస్తున్న పెండ్లాం గుర్తు రాలేదు... నెలల పనిగుదర్జా గుర్తు రాలేదు. వరిగెత్తి పరిగెత్తి వచ్చిన ఊరు గుర్తురాలేదు... తన పొలం గుర్తొచ్చింది... నాయన ప్రాణంలా చూసుకున్న మట్టి మారాణి గుర్తొచ్చింది. తన పొలాన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అకస్మాత్తుగా ఫొలం వైపు గట్టున పడి పెద్దగా రోదిస్తూ. పరుగు లంఘించాడు. ఎండపిట్ట తనకి మబ్బుల రెక్కల్ని అడ్డు పెట్టుకుని... చిన్న చిన్న చినుకై ఆనంద బాష్టాఖి షేకం మొదలెట్టింది.