సమయమంతా వారిద్దరికీ కనిపిస్తోంది ఒక్కటే... వారి గమ్యం సొంతూరి పొలిమేర.
“ఒరేయ్.. ఈరేశం అదిగో దూరంగా ఏదో ఊరు కనిపిత్తాంది.. పొద్దు పొడుత్తాడంది.. ఆ ఊరెళ్ళి అడిగితే ఏ మంచి మనిషో మనకి సాయం చేయకపోడు. తినడానికి ఏం దొరక్క పోయినా. కాసిని నీళ్లన్నా దొరికితే కాస్త సత్తా వత్తది. ఏ గుడికాణ్ణొ పడుకుని పొద్దున్నే ఎలాదం” అన్నాడు రాధయ్య,. “అట్నే మావాా,... అటే ఎళ్లాం పదా”. అని అటుగా నడక మొదలెట్టాడు మామ రాధయ్యని అనుసరిస్తూ వీరేశం. నడిచి నడిచి చెప్పులు కరచి కాలిన బొబ్బల్లా మారిన పాదాలు పగిలి రక్తపుగూడు కట్టుకున్నాయి. అప్పటికే దాదాపూ రెండు వందల కిలోమీటర్లు వారం రోజులుగా నడుస్తున్న ఆ కాళ్ళు శ్రమని మరచిపోయాయ్.
కనిపించిన గ్రామంలోకి వెళ్ళామనుకుంటే.. గ్రామం మొదల్లోనే పెద్ద ముళ్ల కంచె వేశారు.. ప్రపంచం నుంచి తనని తానే వెలేసుకున్న ఆ గ్రామ పొలిమేర చూసి బాధేసింది ఇద్దరికీ. అంతలో అక్కడ కాపలా ఉన్న పోలీసు కానిస్టేబుల్ “ఎవర్రా మీరు గ్రామంలోకి రావడానికి వీలులేదు వెళ్లండీ.. వెళ్ళండీ...” అని గదమాయించాడు.
“అయ్యా మంచినీళ్ళు కూడా దొరకలేదు పొద్దుటాల్నుంచి, కాస్త మంచిళ్ళు ఇప్పించండీ” అన్నాడు. వీరేశం. ఏమనుకున్నాడో గానీ ఆ ఖాకీ దుస్తుల్లోని పెద్దమనిషి వెంటనే “నాకూ నీళ్ళు లేవయ్యా పొద్దున తెచ్చుకున్న నీళ్లూ అడుక్కు వచ్చినయ్.. ఓ పని చేయండి ఈ మూలాటంగా ఎళితే మంచి నీళ్ళ 'సెరువుంది.. అక్కడికెళ్ళి నీళ్ళు
తెచ్చుకోండి” అని సలహా ఇచ్చాడు... చెరువు అనగానే పని దగ్గరమినరల్ వాటర్ బబూల్స్ లోని నీళ్ళు తాగటం అలవాటైన ఇద్దరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.” ఏం కాదు సామీ .. అది మంచి నీటి చెరువే మా ఊరోళ్ళు బాగు చేసుకున్నారీ మధ్య ఎల్లండి, త్వరగా నీళ్ళు తీసుకుని వెళ్ళిపోండి” అన్నాడు.
కానిస్టేబుల్ చెప్పినట్లే... కొద్ది దూరంలో ఉన్న చెరువు చూసి ఉబ్బి తబ్బిబ్బాయ్యారిద్దరూ..ఆ చెరువు నీరే పరమానందంగా తాగి ముఖాలు కడుక్కుని తమ వద్ద ఉన్న రెండు బాటిళ్లలో నీరు నింపుకుని కొద్ది దూరం వెళ్ళి హైవే పైకి ఎక్కి మరలా నడక మొదలెట్టారు. అంతలో వెనుక నుండి వెళ్తున్న రిక్షా వీరిద్దరినీ దాటినాక ఆగింది.ఎవరో ఇద్దరు ముసలోళ్ళు. రిక్షా తొక్కుతున్న చిన్న కుర్రోడు రిక్షా ఆపి దిగి పరిగెత్తుకుంటూ రాధయ్య వాళ్ల దగ్గరికి వచ్చాడు. " ఓ
భయ్యా.. పీనేకా పానీ దోనా.. మేరా నానాం నానీకో ప్వాస్ లగే హై యే బంద్ కే వజైసే సుఖాసే పానీచ్ నై మిలా” అన్నాడు... వాణ్ణి చూడగానే ముచ్చటేసింది.. హైద్రాబాదీ హిందీ అలవాటైన రాధయ్యా..” క్యోం నహీ.. మీలేగా.. జరూర్.. ఆప్ లోగో కహాసే కహా తక్ జానే వాలే..?” అని అడిగాడు... ఎలా అర్ధమైందో వెంటనే “ఓ తెలుగు వాలా.. మేమూ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తయ్.. తమిళనాడు వెళ్లై..” అని తెలిసీ తెలీని తెలుగు భాషలో ఎంచక్కా చెప్పాడు..
వాణ్ణి చూస్తూనే చేతికి బాటిల్ అందించాడు రాధయ్య. టమ మాత్రు భాష వారికి జీవితంలోని అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఎంతగ్గా ఉపయోగపడిందో.. ఆ పిల్లాడి కళ్ళను చూసే వారికి మాత్రమే అర్థమవుతుంది.
వాడు పరిగెత్తుకెళ్ళి రిక్షాపై పడిపోయి ఉన్న వాడి నాయానమ్మకు
బాటిల్ లోని నీళ్ళు తాగించాడు.. “ బంద్ కే వజైసే సబ్ లోగ్ చలే
గయే. హం అకేలే హోగయే.. బచ్చే కే వజైసే హమారా ద చలా
జారే..! అనీ చెప్పాడు ముసలాయన అప్పటికే రిక్షానీ సమీపించిన
వీరిద్దరితో..! “ఘుడత్రియా.. అని దణ్ణం పెట్టి = క్రేలబ్రో యే ఫల్...
“అనీ చేతిలో యాపిల్ ఇవ్వ బోయాడు.. “నై నై బహుత్ దూర్
జారే.. రథ్ బే భయ్..” అని చెప్పి వారిని పంపి .. తమ నడకను
కొనసాగించారు. నీరాటంకంగా నవక కొనసాగిన కొన్నీ గంటల
తర్వాత ఓ ఐస్ షెల్టర్ కనీపించదంతో అక్కడ పడుకుందామని
నిర్ణయించుకున్నారు ఇద్దరూ.
“సరే మావా నేనుకూర్చుంటా నువ్ కాసేపు తాంగో..” అంటూ అప్పటికే ఆగిపోంఎన సెల్ వంక చూస్తూ “* తొందరగా ఇంటికాచ్చేయండయ్యా చంటిది ఎదురుచూస్తున్నాది” అన్న భార్య మాట్లాడిన చివరి మాటలు గుర్తు తెచ్చుకుంటూ తుండు. బస్టాండ్ అరుగుపై విధిలించి కూలబడ్దాడు. అప్పటికే మరో సిమెంట్ అరుగు మీద వాలిన రాధయ్యకు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.. మనం ముందుకెళుతున్నామా.. ? వెనక్కా.? పదవ తరగతి రెండు సార్లు తప్పిన రాథయ్య, అల్లోచన వెల్లువలో కొట్టు మిట్టాడాడు.. తన చిన్నతనంలో చూసిన రోజులు ఇప్పుడు మరలా గమనీంచడం ఆశ్చర్యం వేసింది. (గ్రామాల్లో వెలేసిన కుటుంబాల పరిస్దితి గురొచ్చింది.. చెరువులో నీరు త్రాగటం... పచ్చని చెట్ల నీడలూ గురొచ్చాయ్.. ఆ ఆలోచనల వరదలో పొలం గట్టున బురద పూవై పూసిన నాయన గుర్తొచ్చాడు.
XXXX
“నాయానా... అమ్మా. నేనాచ్చాం.. ఆం తిందాం రా” అన్న గ ఏళ్ళ రాధయ్య పిలుపుతో “వచ్చున్నారయ్యా.. చెట్టుకిందకూకోండి.. వచ్చేచ్చున్నా.” అంటూ పచ్చని పొలాల్లోకి కాలువ నుంచి నీరాదిలి.. ఫారతో గాళ్ళు సర్ధి... కాలువ నీళ్ళతో చేతులు కడుక్కునీ వచ్చి పెళ్ళాం తెచ్చిన బువ్వ తింటూ కొడుకుని (పేమతో చూస్తూ... కళ్ళెగరేసిన వీరయ్యతో... “చేతికున్న మట్టి కడుక్కో నాయనా, కూల్లో అయ్యోరు సెప్తిరిగందా” అన్న రాధయ్య తో....”ఈ మట్టేరా మనకి అన్నం పెదతాంది.. మనకేమైద్ది.. ఏంగాదు నాయనా “* అన్నాడు వీరయ్య.
ఆశ్చర్యంగా చూస్తున్న రాధయ్యను.. “ఇదిగో చూడు సిన్నోడా.. బూమితల్లిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ అన్నాయం జరగదురా.. కట్టాలంటావా వత్తంటయ్ ఫోతాంటయ్.. ఏం రమనమ్మా..” అన్నాడు మధ్యలో పెళ్ళాన్ని పలకరించి... “అవునయ్యా సత్తెం” అంది పెనివిటి పలుకే పరమాన్నమన్నట్లు. తానుతింటూ తింటూ మధ్యలో చెరో ముద్ద మెట్టాదు వీరయ్య..! రమణమ్మ సిగ్గుతో కొంగర్లు చుట్టుకుపోగా.. వీరయ్య బుజమెక్కి ఉప్పమ్మ ఉప్పు.. అనీ ఊగసాగాడు రాధయ్య,.
“సరే నేను సాయంకాలం వస్తా గందా.. మీరు ఇంటికి పోండి.. జాగ్రత్తగా సరేనా... నువ్ కాసేపు అయ్యోరు జెప్పింది సదువుకో... నువ్ సదువుకుంటే మనకట్టాలు దీరతాయ్” అన్న వీరయ్యతో క్త సరే నువ్ తారగా ఇంటికి రా నాయనా..”అంటూ నవ్వుకుంటూ వెళ్తూ తండ్రిని చూస్తూ.. “టాటా” అంటూ తల్లితో వెళ్ళిన రాధయ్య తం(డ్రి నవ్వుని మఠలా చూళ్ళేదు... పలుకు వినలేదు. అప్పటికే తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్-2021 |