పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోదండరామయ్య కాలము నింకా, ఈపొద్దు వరకు తెలుగు కళలకి, నాటకాలకి, కతలకి, కవితలకి, పాటలకి, పద్యాలకి తెలుగు ఉద్యమాలకి ఇది పుట్టినిల్లుగా వుంది.

సమితి గేటు దాటి లోపలికి పోతిని. అబిటికే ఆడ కోదండరామయ్య విగ్రహానికి పెద్దోళ్లు పువ్వులు వేసి మొక్కుతా వుండారు. నేనూ అట్లే చేసి హాలులాకి పోతిని. జనం నిండిపోయి వుండారు.

శ్రీకృష్ణదేవరాయలుగా బాగలూరు బాలక్రిష్టప్పగారు, అల్లసాని పెద్దనగా కలువకుంట నారాయణ పిళ్లెగారు, రామరాజు భూషణుడుగా నాగప్రసాద్‌ మేస్టరు, దూర్ణటిగా అలసపల్లి చంద్రారెడ్డి, అయ్యల రాజు రామబద్రుడుగా సత్యనారాయణా చారి, మాడయ్యగారి మల్లనగా బారందూరు ఎస్‌.టి.రాజు మేస్టరు, పింగళి సూరనగా పాతమత్తిగిరి సుబ్రమణ్యం, రామకృష్ణ కవిగా దేవిశెట్టిపల్లి మునిరాజు గార్లు వేషాలు వేసిండారు.

సమితి అధ్యక్షులు లక్ష్మ్మీనారాయణయ్య మరియు కార్యదర్శి అన్నయప్ప మేస్టరు వేదిక మీదకి వచ్చి శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకాన్ని దీపము వెలిగించి ఆరంబము చేసిరి.

ఒగొగ ఘట్టాన్ని రక్తి కట్టిస్తా వాళ్లు పద్యాలు పాడతా మాటలు మాట్లాడతా వుంటే చూసే కండ్లకి వినే చెవులకి ఈ జన్మకిది చాలు అనిపిచ్చి.

ఆమీట రవంతసేపు తెలుగు సంఘము వాళ్లు అదే వేదిక మీద మీటింగు పెట్టిరి.

“తెలుగుమేస్టర్ల పోస్టులు బర్తీ చేస్తా లేరు” ముగళూరు రామస్వామిరెడ్డి గారు మాట్లాడిరి.

“బస్సుల్లా, బస్టాండుల్లా, తెలుగుపేర్లు తుడిచి తమిళపేర్లు రాస్తా వుండారు. దీన్ని ఖండించి వచ్చే శుక్రవారము నాడు పోరాటము చేయాల, మీరంతా తప్పకుండా రావాల” అగ్గాండపల్లి సత్యనారాయణ రెడ్డిగారు చెప్పిరి. తెలుగుబాస తొందర్లే కాదు రైతుల తొందర్ల గురించి వడ్డపల్లి చిన్నగుట్టప్పగారు మాట్లాడిరి. కిష్టగిరి జిల్లా తెలుగు రచయితల సంఘము నింకా మాట్లాడిన అగ్గరారం నారాయణన్న మాటలు జోరుగా వినబడతా వుంటే నాగొండపల్లి కిష్ణన్న మాటలు చిన్నగా వినబడతా వుండాయి.

మాటలు ఎట్ల వినబడినా దాని భావము మాత్రము ఒగటే. తెలుగుకు అన్యాయం జరగతా వుంది దాన్ని ఎదురించి పోరాడాల, మనము అనుకొనింది సాదీయాలనేదే అందరి మాట.

“ఇటు చూసినా తెలుగే అటు చూసినా తెలుగే ఎటు చూసినా తెలుగే... తెలుగు వినబడాల... తెలుగు కనబడాల... జోరుగా కిర్లతా తెలుగుసంఘమోళ్లు ఎం.జి. రోడ్డులా పోతా వుండారు. నేనూ నా సావాసగాళ్ల జతలా చేరి ఇంగా జోరుగా కిర్లతా పోతా వుండాను.

నేతాజిరోడ్డు దాటి ధర్మాసుపత్రి దాటి తాలూకా ఆఫీసు కంటా పోతిమి. ఆడ రవంతసేపు నిలిస్తిమి. తెలుగు సంఘమోళ్లు పై అధికారులకి వినతి పత్రాలు ఇచ్చిరి.

ఆమీట నెలకి ఆర్భాటము చేసిన ఫలితము అందరికి అందె. అంటే బస్సుల పైనా, బస్టాండులా తెలుగులా పేర్లు గవర్నమెంటు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

39