పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారవనితలు తమ వెంట్రుకలనే చీకటిలో కలసిన మంగళకర రాత్రి కలవారు. నుదురు అనే చంద్రరేఖతో ప్రకాశించే విదియ వంటివారు. కనుబొమలనే లతల సొబగుల లాస్యం యొక్క మనోహర రంగస్థలం వంటివారు. కళ్ళుఅనే చేపలతో కలసియున్న మన్మథ పతాకవంటివారు. అధరమనే బంధూకపుప్ప విలాసంతో విభ్రమ మందిన శరత్కాలం వంటివారు. శంఖాల్లాంటి అందమైన కంఠాలు కలిగినవారు. చక్రవాక పక్షి జంటల వలె ఉన్న స్టనాలతో శృంగారమనే బావి వంటివారట. వింటుంటే నేనుకూడా మదన క్రీడొత్సాహ పీడితుణ్ణై, మట్టెవాడలో మంచనశర్మ, టిట్టిభశెట్టి వారకాంతల కోసం పడ్డ తిప్పల్ని గుర్తుకు చేసుకున్నాను. టిఫిన్‌ ముగిసింది. ఇక అద్దంకి నగర పర్యటనకు బయలుదేరాం!చంద్రమౌళిగారే మా టూర్‌ గైడ్.

ముందుగా రెడ్డిరాజులు కులదైవంగా భావించి పూజించుకున్న నందికంత పోతరాజనే కఠారికి (ఆయుధం) అద్దంకికిగల అనుబంధం, ఆపైన ఆకత్తి అద్దంకినుంచి కొండవీడుకు రాజధానితో తరలిఫోయినవైనం, అతరువాత పెదకోమటి వేముడు, వెలమ ప్రభువు సింగభూపాలునికి మధ్య జరిగిన పోరులో చేయిజారి, మళ్ళీ శ్రీనాధుడు, కొండవీడుకు చేర్చిన వైనం చరిత్ర జ్ఞాపకాల్ని 'ప్రవహింపజేసింది. ఒకసారి ప్రొలయవేముడు, తమ్ముడు మల్లారెడ్డితో కలసి శ్రీశైలయాత్ర ముగించుకొనుచుండగా, శతృవులదాడినుంచి మోటుపల్లిని రక్షించటానికి మల్లారెడ్డి, అద్దంకిని రక్షించటానికి ప్రోలయవేమారెడ్డి, అద్దంకికి చేరుకున్నప్పుడు, వారి తల్లి అన్నమ్మ, నందికంతపోతరాజు కఠారిని, కోటతూర్పుభాగంలో నిలిపి పూజించిన పోతురాజుగండిని చూద్దామని బయలుదేరిన మాకు నిరాశే మిగిలింది. మట్టికోటగోడ కేవలం దిబ్బలా మిగిలింది. అదికూడా ఒక పంతులమ్మగారు కొని కాపాడుతుందిగాబట్టి పోతురాజుగండి, అదుగో ఆపెద్ద బిల్టింగ్‌ కిందే ఉండేదని చంద్రమౌళిగారు చూపించారు. ఇలా చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటీ చెరిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది.


తరువాత రెడ్డిరాజులు నిర్మించిన పాత(అగస్తేశ్వర) శివాలయం, లోపల సప్తమాతృక శిల్చం, ఇంకా అనేక విరిగిన విగ్రహాలను చూశాం. బాగా పేరుమోసిన అద్దంకి పోలేరమ్మ ఆలయం కొత్తకొత్త రంగుల్లో పొంగిపోతూ, ప్రాచీనతకు పాతరేసిన సంగతిని మరచిపోయినట్లుంది. తరువాత అద్దంకిలో రెడ్డిరాజుల కాలంలోనే నిర్మించిన గణపతి ఆలయాన్ని చూశాం. అద్దంకి పరిసర గ్రామాల రైతులు ఆరోజు ఆలయంచుట్టూ తమ అరకల్ని తిప్పి, ఏరువాక పున్నమినీ జరుపుకుంటున్న తీరు మళ్లీనాకు మావూళ్లో ఏరువాక తిరునాళ్లను గుర్తుకుచేసింది. విశాల ప్రాంగణం కుంచించుకుపోయి, ఆధ్యాత్మిక పరిమళాలు ప్రసరించిన చోట అంగళ్లు రాజ్యమేలుతున్నాయి. రెడ్డిరాజుల కాలపు వీరభద్రాలయం కూడా కొత్తరూపుతో పాతదనాన్ని పోగొట్టుకుంది. ఆ తరువాత కాలంలో తాతాచార్యులు నిర్మించాడంటున్న లక్ష్మ నరసింహాలయం, మాధవస్వామి ఆలయాల్ని చూచ్చి గత వైభవప్రాభవాలు ఇంతగా నిర్తక్ష్యానికి గురికావాలా అన్న ప్రశ్న మమ్మల్ని వేధించసాగింది. మధ్యాహ్నం 1.00గంట అవుతుంది. చంద్రమౌళిగారు ఒక పూటకూళ్లమ్మ ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించారు. ధర్మవరం సుబ్రహ్మణ్యంగారికి నేనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చి, అద్దంకి వేయిస్థంభాల గుడిముందు ప్రతిస్టించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన విగ్రహానికి నమస్మరించుకున్నాను. అద్దంకిలోని 6వజార్డి చక్రవర్తి-విక్టోరియారాణి శిల్పాలు, 1850 నాటి తాలూకా ఆఫీసు, 1933 నాటి పోలీస్‌ స్టేషన్‌, ఆస్పత్రి, సబ్‌జైళ్లను చూచి, అవి వెదజల్లే పాత వాసన పరిమళాల్ని ఆస్వాదించాను. అయితే, ఎప్పుడో 800 ఏళ్లక్రితం నిర్మించిన వేయిస్థంభాలగుడి రోడ్డుకంటే 3అడుగుల గుంటలో ఉంది. వాస్తు కళా విన్యాసానికి మారుపేరైన వినాయకుడిగుడిని అంగళ్లు మింగేస్తున్న తీరు మనసును కలచివేసింది. పాత శివాలయంలో చారిత్రక శాసనానికి సున్నంగొట్టి అక్షరాలు కనిపించకుండా చేయటం మరింత బాధను కలిగించింది. ఒకనాటి పౌరుషానికి ప్రతీకగా ఉన్న న్కోటదిబ్బ దిగులుగా మూలుగుతుండటం నన్ను మరింత కృంగదీసింది. నీలిమందు తయారీ తొట్లు, గుట్టు చప్పుడు కాకుండా మాయమవటం తట్టుకోలేని నిజం. ఇన్ని బాధలమథ్య, వేంగీ చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుని సేనాని అద్దంకి


పండరంగడు తరువోజ వృత్తంలో వేయించిన క్రీ.శ.848నాటి శాసనం నా మదిలో మెదిలి కొంత ఊరట, తెలుగు సాహిత్య చరిత్రకు పట్టంగట్టిన విషయం గుర్తుకొచ్చి మరికొంత ఉపశమనమూ కలిగాయి.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

35