పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారసత్వ సంపద

డా౹౹ పి. శివరామకృష్ణ 'శక్తి ' 94414 27977

'ఈ చదువులు మాకొద్దు '

భూగోళంలో అడవులు, బీళ్ళు, నీళ్ళు; ఈ సహజవనరులే అధికశాతం. సంపద సృష్టించటం అనే పేరిట మనం పెంచిన ఆస్తులు తక్కువే. కాని అవి చేస్తున్న హాని ఎప్పుడో హద్దులు దాటిపోయింది. ఈ సహజ వనరులలో ఉత్పత్తులు సేకరించుకుని పొట్టపోసుకునే అభాగ్యులను మనం తరిమేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న వినాశం అదుపులోకి రావాలంటే, రెండు డిగ్రీల ఉస్ణోగ్రత తగ్గాలంటే, మనం పారిశ్రామిక యుగం ముందు దశకు పోవాలని/చేరాలని ఒప్పందాలు, చట్టాలు, లక్ష్యాలు మొత్తుకుంటున్నాయి. ఆ లక్ష్యాలు అందుకోవాలంటే అ అభాగ్యుల జీవన విధానం నుండి నేర్చుకోవటమే ముక్తి మార్గం. ఆ దారి స్పష్టంగా కనిపిస్తున్నా,ఇంతకాలం పెడదారి పట్టిన మనబుద్దులు, చదువులు మారటం లేదు. అస్తి మీది మమకారంతో పాటు పేరు, పదవి, కొలువు, గుర్తింపు తాపత్రయం కొంతైనా వదులుకుంటేనే కాని అది సాధ్యం కాదు.'సమాజం దిగబెరుకుతుంటే, సాహిత్యం ఎగబెరకదు '(కొ.కు).మన కవిత్వం మేడిపండు-మనదరిద్రం రాచపుండు'అంటూ చిరకాలంగా హెచ్చరిస్తున్నా, మనం ఇంకా వేళ్ళు చీక్కుంటూ, ఎముకముక్క కొరుక్కుంటూ మన చదువులూ, అదిసృష్టించే ఉద్యోగాలు, మేధావులు, సాహిత్యగాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం.

కొత్త రూపాలలో పాత చదువులు.

పారిస్‌లోని ఇనాల్కొ లో ఆచార్యుడు డానియల్‌, హైదరబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని దళిత ఆదివాసీ అద్యయన కేంద్రంతో కలిసి, 'కొండకోనలలో తెలుగు గిరిజనులు చెంచు పాటలు 'గిరిగింజ గిరిమల్లెలు 'ఫ్రెంచ్‌లోకి అనువదించటానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందకాలం పొడిగింపుకు ఆయన వెళ్ళినపుడు, నన్నూ తీసుకోని వెళ్లారు. అక్కడ నుంచి ఆ ప్రాంగణంలోగల సెంటర్‌ ఫర్‌ ఈ -లెర్నింగ్‌లో భాషాశాస్త్రవేత్త జంధ్యాల ప్రభాకరరావుగారిని కలిశాం.

“ప్రతి చోటా ఇండిజినస్‌/మూలవాసుల మీద ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు; మీరేమన్నా సాయం చేయగలరా!” అని ఆయన అడిగారు. అంతకుముందే తెలిసిన మానవశాస్త్రశాఖలో విశ్రాంత ఆచార్యుడు శివప్రసాద్‌ అక్కడే ఉన్నారు...

ఈ మూలవాసుల జ్ఞానం, ఆయా స్థల కాలాలు ,వలసలతో ముడిపడి ఉంటుంది.కాబట్టి వారు తిరిగే స్థూల పేర్లు సంప్రదాయ సరిహద్దులు, వలసపోయే దారులు, అనుమతులు, పంపకాలు,తగవులు తీర్చుకునే ఏర్పాట్లు వీటిని చూపించటానికి, ఒక జాగ్రఫీ నిపుణుని సహాకారం కావాలి అని నేను ప్రతిపాదించిన వెంటనే ,సెంటర్‌ ఫర్‌ రీజనల్‌ స్టడీస్‌ లో ఆచార్యులు అరవింద్‌ సుసర్లను ఒప్పించారు.మేం పదిసార్లు పైగా కలిసి ఒక డిష్లామా కోర్స్‌ ప్రవేశపెట్టటానికి పాఠ్యక్రమం తయారు చేసాం. ఇంతలో నేడు “శక్తి 'లో నా బాధ్యతలు పంచుకుంటున్న ఉపగ్రహ అధ్యయనంలో యువ శాస్త్రవేత్త అల్లూరి వరుణ్‌ మాతో కలిసారు. అతడ విశాఖజిల్లా తీరంలో జాలర్లతో, నల్లమల అడవులలో చెంచులతో తిరిగి వారి దేశకాలాలను అర్ధం చేసుకున్నాడు. మేమంతా రాతపని మొదలెట్టే సరికి కరోనా అడ్డుతగిలింది. అయినా ఎవరి పని వారుచేనుకుంటూ ముందుకు వెళుతుంటే, చెంచులకు వీటిమీద దీర్జకాలం శిక్షణ ఇచ్చే కార్యక్రమం వచ్చింది.ఇంతలో ఈ చట్టాలు, విధివిధానాలను పక్కనపెట్టి, పోలవరం ప్రాజెక్ట్‌ కింద మునిగిపోతున్న గ్రామాలను కూల్చివేసి బలవంతంగా తరలింపును నిలిపివేస్తూ, మా పిటిషన్‌ పై, హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాజ్యం, ముందు ముందు ఈ చట్టాల అమలుపై మరింత స్పష్టత తీసుకుని రావచ్చు.

అచరణలోకి తేవలసిన అధ్యయనాలు, చదువులు.

గ్రామనామాల అధ్యయనానికి కేతు విశ్వనాథరెడ్డి గారి కడపజిల్లా ఊళ్ళ పేర్ల మీద చేసిన కృషి భూమిక. ఆయన కథా రచయిత. అరసంలో విశాలాంద్ర ప్రచురణలలో కీలక పాత్ర వహిస్తున్నారు. కాని “పోడు మాజన్మ హక్కు అని ఉద్యమాలు నిర్వహించిన వామపక్షాలు గిరిజనుల జ్ఞానం మీద ఆధారపడిన హక్కుల సమగ్ర గుర్తింపుకు కాక పోడు భూములకు పట్టాలిప్పించే పనికి పరిమితమ్హైనారు. విశ్వవిద్యాలయాలలో మానవ శాస్త్ర శాఖ తన విద్యార్దులను నెల రోజులపాటు మూలవాసులమీద క్షేత్ర కృషి చేయిస్తుంది కాని, ఇంతవరకు ఎక్కడా ఈ వైపు దృష్టి సారించలేదు. ఇటువంటి పరిస్థితిలో కొన్ని స్వచ్చంద సంస్థల వత్తిడితో ప్రభుత్వం అరకొరగా ఈ మూలవాసుల జ్ఞానాన్ని వారి హక్కులను గుర్తించే ప్రయత్నం చేస్తుంది.

కొత్త చదువులు - స్వానుభవాలతో రచనలు. కవితలలో స్పందనలు- ప్రశ్నించటం మరిచి పోయిన పిల్లలు.

కాని నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటంలో మునిగి పోయిన ఉద్యోగులు, స్వానుభవాలు తప్ప సంస్కృతి పట్ల ఆసక్తిలేని వారి రచనల ప్రభావం గిరిజనులలో తమ సంస్కృతిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నాన్ని అణచి వేసింది. (కొన్ని కలలు, మెలకువలు - చిన వీరభద్రుడు. ఎమెస్కో) ఈ పోకడల పరిణామాలకు బాధపడుతున్న ఒక అధ్యాపకుని వేదన, ఈ చదువులు అడవిపిల్లలను మరబొమ్మలుగా మార్చిన తీరును చిత్రిస్తుంది.” గిరిజనపిల్లల్లో ఉండే పట్టుదలను ప్రిన్సిపాల్‌ channelise చేయగలిగాడు. అయితే ఈ పిల్లల్లో సృజన సామర్ధ్యాలను పెంచటంలో జరిగిన కృషి పెద్దగా ఏమీలేదు. పిల్లలు ఎంత మెటిరియల్‌ ఇచ్చినా చదివి పారేస్తారు తప్ప స్వయంగా అలోచించరు.ఫలితాల సాధన అనే మహత్తర లక్ష్యం వారిముందు ఉండటం చేత విద్యార్దుల creatiity ని ఆలోచించే వ్యవధిని వారు తీసుకోపోలేక పోయారు.

పిల్లలు ప్రశ్నించటం మరిచి పోయారు. జ్ఞాపకం ఉండటమే జ్ఞానం అనే స్టితికి చేరుకున్నారు. తరగతిలో పాఠం వింటున్న పిల్లలకు ప్రశ్నలు పుట్టటం లేదంటే వారి thinking faculties ఆగిపోయాయని ఒకవేళ ప్రశ్నించమని ప్రోత్సహించినా ఏం అడగాలో తెలీని పరిస్థితిలోకి పిల్లల మెదళ్ళు మూసుకుపోయాయి. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో ఫలితాలు సాధించిన కళాశాల సాధించిన దేమిటి? గిరిజన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

28