పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

109


క.

వచ్చినవారికి నప్పుడె
యచ్యుతుఁ డెదురేగి మిగుల నందముగాఁగన్
మచ్చికఁ దండ్రికి నన్నకు
ముచ్చట మీరంగ మ్రొక్కి మోదము వెలయన్.

121


క.

వసుదేవప్రముఖుల నల
బిసరుహలోచనుఁడు హేమపీఠంబులఁపై
బొసఁగంగ నిల్పుచు మది కిం
పెసఁగంగా వారిఁ జూచి యిట్లని పల్కెన్.

122


సీ.

వింత యొకటి నేఁడు వినరయ్య దొరలార!
        యరయ నిన్నటిరేయి యంతిపురము
బీగముద్రలునైన పిదపను నిదురించు
        ననిరుద్ధుఁ గానమం చతివ లనిరి
యిది యేమి హేతువో? యిందఱు యోజించి
        తెలియఁబల్కు డటన్నఁ దేటగాఁగ
విని వారు మిక్కిలి విస్మయంబందుచు
        ముందుఁ దోఁచక శౌరిమోముఁ జూచి


గీ.

జగతి సర్వంబుఁ దెలిసిన స్వామివీవ
నీకుఁ దెలియని దేమి? యీ జోకములను
మమ్ము నడుగంగ నేలయ్య? మదన జనక!
తెలియ మీరలె యిపు డానతీయవలయు.

123


వ.

అనిన విని కపటనాటకసూత్రధారుండైన శౌరి సర్వంబునుం
దెలిసియుం దెలియనివానిచందంబున డెందంబున యోజన
సేయుచున్న సమయంబున.