పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఉషాపరిణయము


వ.

ఇవ్విధంబున సుధర్మాస్థానంబునకున్ వచ్చి యచ్యుతుండు
అచ్చటన్ గొలు విచ్చి కూర్చుండి దండనుండు నవసరంబుల
బంధుపరిజనంబుల మంత్రివరుల గుఱిదొరల రప్పించుండని
యానతిచ్చిన.


క.

అవసరమువార లప్పుడె
జపమునఁ జని దొరలకెల్ల సరగునఁ దెల్పన్
సవరణలు మెఱయ వచ్చిరి
నవిరళగతి నుగ్రసేనుఁడాదిగ సభకున్.

119


వ.

మఱియును.


సీ.

తనయుఁ డేకార్యంబుఁ దలఁచినాఁడో! యని
        వసుదేవుఁ డటవచ్చి వాంఛమీర
ననుజుఁ డెవ్వని గెల్వ నాత్మ నెంచెనొ! యని
        నీలాంబరుఁడు వచ్చె నెమ్మిమెఱయ
నని గల్గెనో! తమయన్నకు నని యెంచి
        సాత్యకి వచ్చెను సరభసముగ
నయ్య పిల్పించిన యవసరం బేమని?
        ప్రద్యుమ్నుఁడును వచ్చె బలము కొలువ


గీ.

మఱియు నుద్ధవముఖులైన మంత్రివరులు
పరఁగఁ గృతవర్మ మొదలైన బంధువులును
నల్ల యక్రూరుఁడాదిగా నాప్తజనులు
వచ్చి రాశౌరిసభఁ జేర వరుసగాఁగ.

120


వ.

తదనంతరంబ.