పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105


క.

హరితోడుత నీకార్యము
సరగున నిందఱును దెల్పి సంతసమమరన్
వరునిన్ దోడ్కొని రమ్మని
గరితలకును మ్రొక్కి వారు కదలిరి వేగన్.

110


వ.

అంత.


క.

కమలంబులు వికసించెను
గమలాప్తుం డుదయమయ్యె గౌరవ మొప్పన్
గమలాక్ష! మేలుకొను మని
కమలముఖులు మేలుకొలుపఁ గడువేడుకతోన్.

111


సీ.

హరియప్డు మేల్కాంచి యద్దంబుఁ బువ్వులు
        కపిలధేనువు క్షీరకలశములను
విప్రయుగ్మంబును వేడుక వీక్షించి
        నిత్యకృత్యముఁ దీర్చి నేమమమరఁ
బసిఁడికంబంబుల భాసిల్లుచున్నట్టి
        కొలువుకూటంబునఁ గొమరుమీరఁ
జెలఁగెడు నవరత్నసింహాసనంబునఁ
        గొలువున్నసమయంబుఁ జెలులు దెలిసి


గీ.

విన్నవింపఁగఁ బదియాఱువేలు సతులు
నల్ల రుక్మిణి మొదలైన యష్టమహిషు
లెలమిమీరఁగ శ్రీకృష్ణుఁ గొలువ నపుడు
వచ్చి రచటికిఁ దమతమ వైభవముల.

111


వ.

అంత.