పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘ఆంధ్రకవుల చరిత్రము’లో కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమ యొద్ద వనమాలి విలాసము యొక్క అసమగ్రప్రతి యొకటి కలదని వ్రాసియుండిరి. మానవల్లివారియొద్ద నున్నతాళపత్రప్రతి అదియో వేఱొకటియో తెలియదు. పరిషత్ప్రతి మానవల్లివారి తాళపత్రప్రతి ననుసరించి వ్రాయఁబడినదే. ఇది అసమగ్ర మనుట స్పష్టము. వనమాలి విలాసము యొక్క సమగ్రప్రతి యెప్పటికైన లభించుచో సూరన కవితావిశేషములు ఇంకను కరతలామలకము కాఁగలవు. పరిశోధకులైన జిజ్ఞాసువులు అన్వేషింపవలసియున్నది.

ప్ర. సంపా.