గీ. |
చెలఁగుబలములతో నుగ్రసేనుఁ దాఁకి
బాణముల హంసుఁ డిన్నూటపదిట నేసె
డిభకుఁడును వసుదేవు నేడింట నేసె
నిరువురఁ బొదివి యాదవు లేసి రంత.
| 276
|
క. |
అప్పుడు పదిపదియమ్ములఁ
దప్పక యాదవుల బ్రహ్మదత్తకుమారుల్
నొప్పింప రుధిరధారలు
చిప్పిల్లనివారు లేరు సేనలలోనన్.
| 277
|
చ. |
తమబల మింక వీఁగు నని తత్సమయంబునఁ గృష్ణరేవతీ
రమణులు దాఁకి రయ్యిరువురన్ సురసిద్ధమునీంద్రబృందముల్
సమరము జూచి మెచ్చ హరశాసనతత్పరభూతయుగ్మముం
గ్రమమునఁ దోఁచెఁ దోడుపడ రాజకుమారుల రెండుదిక్కులన్.
| 278
|
మ. |
హరితో హంసుఁడు సీరితో డిభకుఁడున్ హంకారహుంకారభీ
కరశంఖధ్వని విక్రమం బమర వీఁకం దాఁకినం బాంచజ
న్యరవాడంబరమున్ సహింప కడరెన్ మాహేశుభూతద్వయం
బరవా యించుక లేక హస్తధృతశూలాకారఘోరంబుగన్.
| 279
|
గీ. |
అడరి హరిమేను శూలంబు నదుముటయును
జిఱునగవుతోడ దివిజు లచ్చెరువు నొంద
వారితేరిపై కుఱికి చేయారఁ బట్టి
విసరి యుత్తర[1]దిక్కున వీచివైచె.
| 280
|
కృష్ణుఁడు భూతద్వయమును గైలాసాద్రిపై బడవై చుట
క. |
వైచిన నిరువురుఁ గైలా
సాచలశిఖరమునఁ బడి మహాద్భుతమతులై
రాచంద మెల్ల హంసుఁడు
చూచి హరిం గ్రోధపరవశుం డై పలికెన్.
| 281
|
- ↑ రుక్కుకై