పుట:ఆముక్తమాల్యద.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శుకకదంబము గొలుసులచే నిబద్ధమై
                   వారాంగనాగారకారఁ బడఁగ;
గిరికానికాయంబు లరిశూన్యబహుపుర
                   హర్మ్యవాటికలఁ జెడాడుచుండఁ;
గ్రందుగా నితరేతరంబు రాయిడి సేయు
                   రాజులు దననూపురమున నొదుఁగ;
నెగడు ననావృష్టి నిజబరేభస్పర్ధి
                   సమదాన్యకరటి గండములఁ జేర;


తే.

దానవేళల నతివృష్టి తనకు హస్త
గతము గాఁగఁ బ్రతాపాగ్నిఁ గ్రాఁగిపోవు
కందకులయందు శలభత గలయ నడఁగ
నేలు నాపాండ్యుఁడు మహి నిరీతి గాఁగ.

43


వ.

అమ్మహీవల్లభుం డివ్విధంబున సామ్రాజ్యవైభవంబు లనుభవించుచుండఁ
గొంతకాలంబున.

44

గ్రీష్మము

తే.

పాటలవసుంధరారుహభాగధేయ
మాతతమరీచికాంబువర్షాగమంబు
ధరణిఁ బొడసూపె నంత నిదాఘసమయ
మదుటుతో శాల్మలీఫలవిదళనంబు.

45


సీ.

నిర్ఝరప్రబలవేణిక లింకఁ జట్రాలఁ
                   బేరిన ప్రాఁచి పెన్పేటు లెగసె
నెఱుకులు పడియనీ రివుర గువ్వలఁ బట్టఁ
                   బోయునీ రాడదఁ బొలము నెఱసె
సురగాలి దవదగ్ధతరుపర్ణతతి రేఁపఁ
                   బావురా లని డేగపదుపు దూఱె
నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
                   బడిన యధ్వగపంక్తి పొరలుపెట్టె