నిండోలగం బుండి దండనాథసామంతసందోహంబులం బిలిపించి బెందల
కడన మందిరంబుల కనిపి వివిధవేదాగమవిదులగు విద్యజ్జనంబులఁ గాని
పించికొని నమస్కరించి యాశుభస్వప్నంబు వినిపించిన హర్షించి వారును
సవిస్మయస్వాంతులై ‘దేవా, దేవదేవుండు విజయంబు చేసిన యాస్వప్నం
బనేకశోభనపరంపరలం దెలుపుచున్నయది. ఎట్లనిన, ప్రథమ మప్పద్మేక్షణు
స్వప్నసాక్షాత్కారం బితోధికభక్తియు, నతండు ప్రబంధనిబంధనంబుఁ
గావింపుమనుట యితోధికాగాధసారస్వతోద్బోధంబును, నతని దేవీసమాగమం
బితోధికాఖండభాండాగారసమృద్ధియు, నతని యాసతిచేతి విశదశతచ్ఛదం
బితోధికాద్వితీయసితఛత్త్రతయు, నతం డశేషనృపసేవం దత్తద్భాష లెఱుం
గవె యనుట యితోధికసమస్తసామంతసమాజసమాకర్షణంబును,
ప్రియోపభోగపరిశిష్టభోగం బింపనుట యితోధికబహుప్రేయసీప్రాప్తియు,
కృతి చెప్ప నుత్తరోత్తరాభివృద్ధి యగు ననుట యితోధికాప్తయపరమాయుర
వాప్తియు, నగు. నఖర్వమహిమాతిధూర్వహుఁడగు తుర్వసువంశంబునం
బుట్టినట్టి నీ కిట్టి శోభనపరంపర లేమద్భుతంబు, లవధరింపుము.