పుట:ఆముక్తమాల్యద.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దన చిరంతన తులసికాదామకరణ
దాస్యమును జేసికొనుచుఁ దత్పరత నుండె.

37


వ.

ఒక్కనాడు మధ్యాహ్నసమయమాలికాసమారోపణానంతరంబున మంది
రఁబునకుఁ బోవునతనిఁ బ్రసాదమందస్మితసుందరవళక్షం బగుకటాక్షంబున
వీక్షించి పక్షిపుంగవకేతనుండు పుండరీకనికేతన కి ట్లనియె.

38

యామునాచార్య చరిత్రము

తే.

'యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున' ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.

39


క.

'ఇతనికథ యెఱిఁగినదె కా,
యతఁడేమి యొనర్చె?' ననిన నబ్జాక్షుం డా
శతపత్త్రనిలయ కిట్లను,
'నతివ కలం డొకఁడు మత్సదాశ్రితుఁ డాదిన్.

40


తే.

అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్యవిద్య లభ్య
సించుచుండ, నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుఁడే యొకండు.

41


తే.

వెఱ్ఱిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు
నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,
హరుఁడె పరతత్త్వ మను, మదీయాలయముల
నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్లె.

42


సీ.

అశ్రాంతజంగమార్చాసక్తి వర్తిలు
                   వేదవిద్ద్విజపూజ వీటిఁ గలిపి;
భౌమవారపు వీరభద్రపళ్ళెర మిడు
                   గృహదైవతంబు లిఱ్ఱింకు లింక;
షణ్ణవతిశ్రాద్ధచయ మారఁ బెట్టు సం
                   కరదాస మయ్య భక్తప్రతతికి;