పుట:ఆముక్తమాల్యద.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గల జావడంబులకుం బుట్టి కాల్గట్టి విడువ నెత్తంబున మెత్తని గఱిక మేసి
పోసరించి మాపుమాపున మేపు సజ్జకవణంపు మేపునఁ బిడుక గొఱసంబు తోమ
కంబునఁ బుటపుటనై కఱియకంబడిప్రాఁకఁ గనియైన నీడం గనియైనం బెదరు
కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలుకుంచెలు గీలించిన గవ్వదంటల
గంటల నలంకరించి మోలుగుమడ్డిం దోఁచి మూర కొక్కడును జేన కొక్కండు
నుగాఁ గుట్టిన డొల్లుటుల్లారు లుల్లసిల్లం బల్లించిన పల్లంబులపైఁ జిల్లతైలం
బును వాసనకొడుపులం బూసిన మణుంగుఁ జంద్రికచేలలె రవణంబులుగా
నెదురుగా వేడుకం జూడవచ్చిన యవ్వీటి మేటిసాలె యగసాలె పటుసాలె
వానెవై జాతి సాఁతు లేతులకొమరులు తుములమై వచ్చు తచ్చమూసామజం
బులం జూచి యేచిన వెఱం దమ యెక్కిరింత లెక్కికొని వాగె లిరుగేలం
గుదియంబట్టిన నిలువ కయ్యుత్సవం బీక్షింప వచ్చినప్రజలం ద్రొక్కుచుం
బోవఁ; తన్మధ్యవృద్ధవధ్వాతురాదులు దిట్ట నిట్టట్టనలేక ప్రాణంబులు పిడి
కిటం బట్టుకొనిపోవుచు, నవీనసవిధకేదారంబులం ద్రెళ్ళి చట్టలు దిగంబడి
వెడలలేకుండం దారు దిగ నిమ్ము లేక పిమ్మటఁగొని నలుదెసలఁ జూడం, జూచి
కేలు సఱచి కోహోయని గేలిసేయు గణికాకదంబంబుల చప్పటులు నిబిడ
నిష్కుటవిటపిఝాటంబులం బ్రతిశబ్దంబులు పుట్టింప; లి ట్లనూనవిభవంబు చిగు
రొత్త నత్తిరుపతి సొచ్చి యచ్చక్రధరునగరి మోసల నిలచుటయు, నవ్విష్ణు
చిత్తుండు దద్రథావతరణంబు చేసి, ధరణీధవస్థానికసమూహంబు వెంటరా
నవ్వైకుంఠు సేవించి, తత్ప్రసాదలబ్ధంబగు వరిపట్టంబున నలంకృతుడై,
నానాలంకారసహితంబును రత్నకాంచనమయంబులు నగు నాత్మీయభవనంబుం
గాంచి విస్మితుండై పుండరీకాక్షమహిమాభిలబ్ధవైభవంబుగాఁ దెలిసి, తత్రత్య
ధాత్రీకళత్రవర్గంబుల ననిపి ప్రవేశించి, తొంటికంటె శతగుణంబులుగా భాగవత
పూజాప్రవణుండై యుండె నంత.

35


మ.

ఉలుపా ల్పట్టినయిండ్ల మజ్జన నృపార్హోదారభుక్తిక్రియో
జ్వలులై, రే హరీకొల్వునన్ వివిధలాస్యస్పర్ధి సుభ్రూభ్రుకుం
సులవాదు ల్పరిదేర్చి పుచ్చి, మణివాసోభూషణగ్రామమున్
జలజాతాక్షునకు సమర్పణము నిష్టం జేసి, యవ్వేకువన్.

36


తే.

ప్రభువు అరిగిరి క్రమ్మఱఁ బాండ్యనగరి,
కమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ